ఢిల్లీ మద్యం కేసులో కవితకు బెయిల్!

సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కేసులో కల్వకుంట్ల కవితకు బెయిల్ లభించింది. గత ఐదు నెలలుగా కవిత ఈ కేసులో తీహార్ జైలులో వున్నారు. ఈ ఐదు నెలల నుంచి ఆమె బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంతకాలానికి బెయిల్ మంజూరైంది. కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కవిత తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ, ఈడీ తరఫున ఏఎస్జీ వాదనలు వినిపించారు. రెండు వైపుల నుంచి వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది.