ఎంఎంటిఎస్ లో అత్యాచారయత్నం..రన్నింగ్ ట్రైన్ నుంచి దూకిన బాధితురాలు

సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది.  సికింద్రాబాద్ నుంచి మేడ్చెల్ వెళ్లే ఎంఎంటిఎస్ రైలులో  యువతిపై గుర్తుతెలియని యువకుడు అత్యాచారయత్నం చేయబోయాడు. తప్పించుకునేందుకు ఆ యువతి భోగిలో  నుంచే దూకేసింది. దీంతో ఆ యువతి తీవ్ర రక్త స్రావంతో గాయాలపాలైంది. చికిత్స నిమిత్తం ఆ యువతిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.  ఆదివారం రాత్రి ఈ దుర్ఘటన చేసుకుంది. ఆ యువతిని కాపాడే నాథుడే లేకపోవడంతో కొంపల్లి స్టేషన్  సమీపంలో దూకేసింది. మేడ్చెల్ లో ప్రయివేటు హాస్టల్ లో ఉండే ఈ యువతి మొబైల్ ఫోన్  రిపేర్ చేసుకోవడానికి సికింద్రాబాద్ చేరుకుంది. రిపేర్ అయ్యాక తిరుగు పయనమైంది. ఒక్కో స్టేషన్ లో ప్రయాణికులు దిగిపోయారు. మహిళా భోగిలో ఒంటరిగా ఉన్న యువతికి కీడు శంకించింది. ఇంతలో  గుర్తు తెలియని  యువకుడు అల్వాల్ లో  ఎక్కాడు. ఎవరూ లేకపోవడంతో అత్యాచార యత్నం చేయబోయాడు. యువతి గట్టిగా కేకలు వేసినప్పటికీ రక్షించే వారు కరువయ్యారు. నడుస్తున్నభోగినుంచి ప్రమాదం అని తెలిసినప్పటికీ మానాన్ని కాపాడుకోవడానికి ఒక్కసారిగా బోగిలో నుంచి దూకేసింది. రైల్వేట్రాక్ పై పడిపోయి తీవ్ర రక్త స్రావమయ్యింది. చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. తనపై అత్యాచారయత్నం చేసిన యువకుడిని తాను మాత్రమే గుర్తుపట్టగలనని బాధితురాలుపోలీసులకు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ఈ ఘటనతో ఎంఎంటిఎస్ మహిళలకు ఎంతవరకు సేఫ్ అనే  ప్రశ్న ఉత్పన్నమైంది. నిత్యం వేలాది మహిళలు ఎంఎంటిఎస్ ద్వారా తమ గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు.