పంచాయతీ కార్యాలయాల రంగులపై జగన్‌ సర్కార్‌ వెనకడుగు.. కానీ?

హైకోర్టు, సుప్రీంకోర్టు లలో ఎదురుదెబ్బలు నేపథ్యంలో.. పంచాయతీ కార్యాలయాల రంగులపై జగన్‌ సర్కార్ ఎట్టకేలకు‌ వెనకడుగు వేసింది. కార్యాలయాల రంగులు మార్చాలని పంచాయతీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భవనాలపై ఉన్న నీలం, ఆకుపచ్చ రంగుల్ని తొలగించాలని ఆదేశాల్లో పేర్కొంది. అన్ని కార్యాలయాలకు తెలుపు రంగు మాత్రమే వేయాలని తెలిపింది. అయితే, భవనాలపై సీఎం జగన్‌ బొమ్మ తప్పనిసరిగా ఉండాలని ఆదేశాలిచ్చింది.