తిరుపతిలో ఏపీ ఫస్ట్ రీసెర్చ్ సెంటర్.. చంద్రబాబు

యువతరం భవిష్యత్  బంగారంగా ఉండాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతున్నది.  ఆ దిశగా అన్ని విధాలుగా యువత భవిష్యత్ ను తీర్చిదిద్దేలా అవసరమైన చర్యలు తీసుకునేలా విధానాల రూపకల్పన జరగాలని చంద్రబాబు ఆధికారులకు ఆదేశాలు జారీ చేశారు.  భవిష్యత్తులో ఏయే రంగాల్లో యువతకు మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలుంటాయో గుర్తించడంతో పాటు,  .ఆయా రంగాల్లో యువతలో నైపుణ్యాన్ని పెంచడంపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. తన క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం (జనవరి 16) ఏరో స్పేస్, డిఫెన్స్, ఐటీ, డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ సలహదారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ భేటీలో డ్రోన్ కార్పొరేషన్ ఉన్నతా ధికారులు పాల్గొన్నారు.  రాష్ట్రంలో తిరుపతి కేంద్రంగా అతిపెద్ద పరిశోధనా కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ (AP FIRST) పేరుతో తిరుపతిలో రీసెర్చ్ కేంద్రం ఏర్పాటుకు సీఎం ఆమోదముద్ర వేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందన్నారు. వివిధ రంగాల్లో కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయనీ,  ఎయిరో స్పేస్, డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీ, ఏఐ, సైబర్ సెక్యూర్టీ, సెమీ కండక్టర్ల డివైసెస్, సెన్సార్లు, క్వాంటం టెక్నాలజీ, హెల్త్ కేర్, బయో టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, రూరల్ ఏరియా టెక్నాలజీ వంటి రంగాలు భవిష్యత్తులో కీలకం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందుకు అనుగుణంగా పాలసీలు రూపొందిస్తోంది.

ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టే కంపెనీలను ప్రొత్సహిస్తోంది. దేశంలో తొలిసారిగా గ్రీన్ ఎనర్జీ రంగంలో గ్రీన్ అమోనియా ప్లాంట్ కాకినాడలో ఏర్పాటు చేయబోతున్నామని చంద్రబాబు వివరించారు. ఈ తరహాలో కొత్త ఆవిష్కరణలకు...వివిధ స్టార్టప్ కంపెనీలకు రాష్ట్రం వేదికగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఇలా వచ్చే కంపెనీలకు... పరిశ్రమలకు నైపుణ్యమున్న యవతను అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందనీ, ఆ దిశగా చర్యలు, విధానాల రూపకల్పనలు జరగాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.  ఇందుకురాష్ట్ర ప్రభుత్వం తరఫున తిరుపతిలో  ఓ అతి పెద్ద అధ్యయన కేంద్రాన్ని తిరుపతిలో ఏపీఫస్ట్ పేరిట ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.  తిరుపతిలోని ఐఐటీ-ఐఐఎస్‌ఈఆర్ రెండు ప్రముఖ జాతీయ విద్యా సంస్థల కాంబినేషన్లో ఏపీఫస్ట్ ఏర్పాటు కాబోతోందన్న ఆయన దీనిని  అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిది ద్దాలన్నారు.  ఏపీ ఫస్ట్ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వంతోనూ సంప్రదిం పులు జరపాలని చంద్రబాబు సూచించారు.  

  నిరంతరం ఏపీని అభివృద్ధి చేయడంతోపాటు...యువతకు చక్కటి ఉపాధి కల్పించడంపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందనీ,  సంక్షేమానికి-అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో కృషి చేస్తోందో,  యువతకు మెరుగైన అవకాశాలు అందించే విషయంలోనూ అదే స్థాయిలో ప్రణాళికలు సిద్దం చేస్తోందన్నారు. దీంట్లో భాగంగానే ఏపీ ఫస్ట్   ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. యూనివర్శిటీలు, వివిధ రంగాల్లో ప్రముఖ స్థానంలో ఉన్న కంపెనీలతో ఏపీ ఫస్ట్ సమన్వయం చేసుకుని,  ఇప్పటికే వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్శిటీల్లో విద్యార్థులు చేస్తున్న కొత్త కొత్త ఆవిష్కరణలను అంది పుచ్చుకోవాలన్నారు.

 అలాగే యువతలో వివిధ రంగాల్లో నైపుణ్యం పెంచేందుకు పరిశ్రమలు, కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఉండాలన్నారు. అదే విధంగా   అందుబాటులోకి వస్తోన్న టెక్నాలజీలు ఏంటీ...? ఏయే రంగాల్లో అభివృద్ధి జరుగుతోందనే విషయాలను గుర్తించి.. వాటిని కరిక్యులమ్‌లో చేర్చేలా విద్యా సంస్థలతో సంప్రదింపులు జరపాలన్నారు. ఈ మేరకు ఆయా విద్యా సంస్థలకు కరిక్యులమ్ ప్రిపేర్ చేసేలా ఏపీ ఫస్ట్ పని చేయాలని చంద్రబాబు తెలిపారు. ఐటీని ప్రమోట్ చేయడం వల్ల ఇప్పుడు తెలుగువాళ్లు ఐటీలో మేటిగా ఉన్నారు. అలాగే ఫార్మా రంగంలో భవిష్యత్ ఉంటుందని గుర్తించడం వల్లే తెలుగు రాష్ట్రాలు ఫార్మాలో అగ్రభాగాన ఉన్నాయి. ఇదే తరహాలో భవిష్యత్ రంగాలను నేటి యువత అందిపుచ్చుకోవాలనీ, అందుకు తగిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందనీ చెప్పారు.  వచ్చే మూడేళ్లల్లో కీలక పురోగతి కనబరిచేలా ఏపీ ఫస్ట్ పని చేయాలి.” అని ముఖ్యమంత్రి సూచించారు. 

అలాగే.. డ్రోన్ కార్పొరేషన్‌ను మరింత బలోపేతం చేయాలనీ, ప్రకృతి వైపరీత్యాల సందర్భాల్లో డ్రోన్లను వినియోగించి బాధితులకు సేవలు అందించాం. ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో డ్రోన్లను వినియోగించుకుని ప్రజలకు సేవలు అందించాలన్నారు. వ్యవసాయం, మెడికల్ ఎమర్జెన్సీ వంటి వాటిల్లో డ్రోన్ల వినియోగం పెరగాల్సిన అవసరం ఉందనిచెప్పారు. ఇటువంటి ఫ్యూచర్ టెక్నాలజీలను అందిపుచ్చుకోవడానికి ఇప్పటి నుంచే సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు.  ఈ  సమావేశంలో ఏరో స్పేస్ డిఫెన్స్ సలహదారు సతీష్ రెడ్డి, ఐటీ-డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ సలహదారు అమిత్ దుగర్, తిరుపతి ఐఐటీ డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ, ప్రొఫెసర్ సెంథిల్ కుమార్, డీఎంటీఐ డైరెక్టర్ కల్నల్ పీఎస్ రెడ్డి సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu