మానవహక్కుల నేత కాల్చివేత

 

పాకిస్తాన్, కరాచీలో మానవ హక్కుల నేత సబీన్ మహమ్మద్ పై తెలియని దుండగులు కాల్పులు జరిపారు. బలూచిస్తాన్ పేరుతో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ప్రసంగించిన ఆమె హోటల్ నుండి బయటికి వెళుతుండగా ఇద్దరు దుండగులు ఆమె కారుపై కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో సబీన్ మహమ్మద్ తో పాటు ఆమె తల్లి కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించేలోపే సబీన్ ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసు అధికారి తారిఖ్ ధరేజో తెలిపారు. కాగా సబీన్ మహమ్మద్ గత కొంత కాలంగా బలూచిస్తాన్ ప్రావిన్స్ లో తిరుగుబాటుదారులతో, పోలీసుదళాలకు మధ్య నడుస్తున్న పోరులో అమాయకులను కాల్చి చంపుతున్నారని ఆరోపిస్తూ ఉద్యమిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu