పట్టిసీమ వల్ల ఉపయోగంలేదు.. పురంధేశ్వరి

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురుంధరేశ్వరి చంద్రబాబు చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీటికొరత తీరుతుందని.. ఈప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీళ్లు అందిస్తామని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని ఎద్దేవ చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి..కృష్ణా జలాలను అనుసంధానం చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని.. ఎందుకంటే పట్టిసీమ ప్రాజెక్టు తాత్కాలిక ప్రాజెక్టు మాత్రమే.. దీనివలన ఉపయోగం ఏం లేదని అన్నారు. మూడేళ్ల తరువాత ప్రాజెక్టు ఉండదు.. దీనికి సంబంధించిన ఉత్తర్వుల్లో సర్కారే ఈవిషయాన్ని పేర్కొందని తెలిపారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు.. అది పూర్తయితేనే రాయలసీమకు నీళ్ల కరువు తీరుతుందని.. కాబట్టి ఈ ప్రాజెక్టుపై దృష్టిసారించాలని సూచించారు. కేంద్రం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి గతంలో 100 కోట్లు నిధులు మంజూరు చేసింది.. అది ఏం చేశారో తెలియదు.. ఇప్పుడు మళ్లీ రూ 350 కోట్లు మంజూరు చేసింది.. ఇప్పుడైనా ఈ నిధులను సద్వినియోగం చేస్తారో లేదో చూడాలి అని వ్యాఖ్యానించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu