అమెరికాలో కాల్పుల కలకలం.. 50 మంది మృతి

 

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. బర్లాండ్ లోని గే నైట్ క్లబ్ లో దుండగుడు జరిపిన కాల్పుల్లో దాదాపు 50 మంది మృతి చెందారు. అయితే ఈ దాడులకు పాల్పడింది ఒమర్ మతీన్ గా పోలీసులు గుర్తించారు. వివరాల ప్రకారం..  ఆఫ్ఘనిస్థాన్ నుంచి వలస వచ్చి ఫ్లోరిడాలో స్థిరపడ్డ దంపతుల కుమారుడు ఒమర్ మతీన్. అయితే ఒమర్ మతీన్ ఐఎస్ వైపు ఆకర్షితుడయ్యాడు. దీంతో గతంలోనే దీనిపై అతను అతడిని ఎఫ్ బీఐ అధికారులు ప్రశ్నించిన సందర్బాలు కూడా ఉన్నాయట. అయితే నిన్న  ఓర్లాండో నైట్ క్లబ్ లో కాల్పులకు దిగింది కూడా ఒమర్ మతీనే అని.. అంతేకాదు.. "అమక్" ఐఎస్ వార్తా సంస్థ... ఓర్లాండోలో బీభత్సం సృష్టించిన దుండగుడు ఐఎస్ కు చెందిన ఫైటరేనని ప్రకటించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu