మోడీ పాలనలో..గుజరాత్‌కు మరో గౌరవం

గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది..అహ్మదాబాద్‌ను ప్రపంచ వారసత్వ నగరంగా యునెస్కో గుర్తించింది. ఢిల్లీ, ముంబైలతో పోటీపడి అహ్మదాబాద్‌ ఈ గౌరవాన్ని దక్కించుకుని భారత్‌లో ఈ గౌరవం పొందిన తొలి నగరంగా రికార్డుల్లోకి ఎక్కింది. అహ్మదాబాద్‌ను 6 వందల ఏళ్ల క్రితం అహ్మద్ షా నిర్మించాడని..చరిత్ర చెబుతోంది..ఇక్కడ ఎన్నో అపురూప కట్టడాలు, కోటలు ఉన్నాయి..ఈ చారిత్రక కట్టడాల రక్షణకు ప్రభుత్వం ఎన్నో ఏర్పాట్లు చేసింది. మరోవైపు అహ్మదాబాద్‌ను వారసత్వ నగరంగా గుర్తించడం పట్ల గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సంతోషం వ్యక్తం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu