రెచ్చిపోయిన తాలిబన్లు... సైనిక స్థావరంపై దాడి..

 

ఆఫ్గనిస్థాన్ లో మరోసారి తాలిబన్లు రెచ్చిపోయారు. ఆఫ్గనిస్థాన్ లోని కాందహార్‌ ప్రావిన్స్‌లో తానిబన్లు సైనిక స్థావరంపై దాడికి పాల్పడ్డారు.  మిలిటెంట్లు గుంపుగా వచ్చి దాడి చేయగా... సైనికులు-మిలిటెంట్లకు మధ్య కొన్ని గంటల పాటు పోరు కొనసాగింది. ఈ దాడిలో నలుగురు సైనికులు మరణించగా.. మరికొంతమంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.