జానీ మాస్టర్ భార్యపై చర్యలు?

మహిళా కొరియోగ్రాఫర్‌పై జానీ మాస్టర్ అత్యాచారం జరిపిన కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. యువతిపై దాడి చేశారన్న ఆరోపణల నేపథ్యంలో జానీ మాస్టర్ భార్య అయేషా పైనా చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యువతిపై అత్యాచారం కేసులో జానీ మాస్టర్‌ను గోవాలో అరెస్టు చేసిన పోలీసులు.. చంచల్ గూడ జైలుకు తరలించారు. విచారణలో జానీ మాస్టర్ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ  నేపథ్యంలో కేసు మరో కీలక మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది.