ఆప్ ఎమ్మెల్యేపై సుప్రీం సీరియస్.. సాయంత్రంలోపు లొంగిపోవాలి

ఆప్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి  సోమ్‌నాథ్ భారతిపై ఆయన భార్య గృహహింస హత్యాయత్నం కింద కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సోమ్‌నాథ్ భారతికి హెచ్చరిక చేసింది. సాయంత్రం 6 గంటల లోపు లొంగిపోవాలని ఆదేశించింది. ఈకేసుపై ఇప్పటికే సోమ్‌నాథ్ భారతి కింద కోర్టు.. హైకోర్టులను ఆశ్రయించారు.. అయితే అక్కడ ఆయనకు చుక్కెదురైంది. దీంతో ఆయన బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు కూడా బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ సాయంత్రం 6 గంటల లోపు లొంగిపోవాలని ఆదేశించింది. న్యాయవ్యవస్థను కించపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.