26/11 నిందితుడు అరెస్ట్..

 

26/11 ఈరోజు అందరికి గుర్తుండే ఉంటుంది. 2008 వ సంవత్సరంలో 26/11 రోజున ముంబైలో ఉగ్రవాదులు జరిపి మారణహోమం సృష్టించారు. ఈ దాడిలో విదేశీయులు సహా 160 మంది మృతి చెందగా దాదాపు 308 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఇప్పుడు ఈ దాడుల కీలక నిందితుడుగా భావిస్తున్న సుఫియాన్ జాఫర్‌ను పాకిస్థాన్ భద్రతా దళాలు అరెస్ట్ చేశారు. అతనిని పోలీసులు యాంటీ టెర్రరిజం కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు 8 రోజుల రిమాండ్ విధించింది. కాగా డైరెక్టర్ మజ్హర్ కాకాఖేల్ ఆధ్వర్యంలోని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎఫ్ఐఏ) బృందం నిందితుడిని ఇంటరాగేట్ చేయనుంది. మరి ఈ విచారణలో ఇంకెన్ని నిజాలు బయటపడతాయో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu