పాక్లో వెలుగుచూసిన 1300 ఏళ్లనాటి విష్ణువు ఆలయం
posted on Nov 20, 2020 7:10PM
పాకిస్తాన్ లో అతిపురాతనమైన హిందూ ఆలయం వెలుగుచూసింది. వాయువ్య పాకిస్తాన్ లోని స్వాత్ జిల్లా బరీకోట్ ఘుండాయ్ దగ్గర పురావస్తుశాఖ చేపట్టిన తవ్వకాల్లో 1300 ఏళ్లనాటి ఆలయం బయటపడింది. దీనిని శ్రీ మహా విష్ణువు ఆలయంగా గుర్తించినట్టు పాకిస్తాన్ పురావస్తుశాఖ చీఫ్ ఫజల్ ఖాలిక్ తెలిపారు. 1300 ఏళ్ల క్రితం హిందూ షాహీ కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు భావిస్తున్నామన్నారు.
కాగా, హిందూ షాహీస్ లేదా కాబూల్ షాహీస్ ఒక హిందూ రాజ్యవంశంగా చెబుతారు. చరిత్ర ప్రకారం క్రీ.శ. 850-1026 మధ్య కాలంలో ఈ వంశస్థులు.. ఇప్పుడు పాక్ లో భాగమైన కాబూల్ లోయ, గాంధారాతో పాటు వాయవ్య భారత్ ప్రాంతాన్ని పాలించారు. వారే ఈ ఆలయాన్ని నిర్మించినట్టు అభిప్రాయపడుతున్నారు.