జగన్ ను అన్యాయంగా అరెస్ట్ చేశారు: షర్మిల

వైఎస్ విజయమ్మకు బుధవారం శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఉపఎన్నికలు జరుగుతున్న నర్సన్నపేట జనసంద్రంగా మారింది. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో విజయమ్మ ప్రచారం కొనసాగుతోంది. ఉప ఎన్నికల ప్రచారంలో జగన్ సోదరి షర్మిల కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...'జగనన్నను అన్యాయంగా అరెస్ట్ చేశారు. మా కన్నీటిని చూసి నవ్వుతున్నవారికి గుణపాఠం చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటువేసి కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెప్పండి' అని పిలుపునిచ్చారు. మళ్లీ రాజన్న రాజ్యాన్ని తెచ్చుకోవాలని, జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలని షర్మిల కోరారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu