తెలంగాణ రాజ్యసభ అభ్యర్ధులు వీరే...

 

తెలంగాణకు రెండు రాజ్యసభ స్థానాల్లో భర్తీ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ స్థానాలకు గాను రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్దులను ప్రకటించింది. రాజ్యసభ అభ్యర్ధులుగా కెప్టెన్ లక్ష్మీ కాంతారావు, డీఎస్ పేర్లను ఖరారు చేసింది. ఎన్నికల పర్యవేక్షకులుగా మంత్రులు ఈటెల రాజేందర్, నాయిని నర్సింహా రెడ్డిలను కేసీఆర్ నియమించారు. ఇక దీనితో పాటు తుమ్మల రాజీనామా చేయగా ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి మాజీ మంత్రి ఫరిద్దుద్దీన్ ను ఎంపిక చేశారు. కాగా పాలేరు ఉపఎన్నికలో తుమ్మల నాగేశ్వరరావు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu