కావేరీ జల వివాదం... వచ్చే నెల 7కు వాయిదా..


గత కొద్దికాలంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరీ జల వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూనే ఉంది. అయితే ఈరోజు దీనిపై విచారించిన సుప్రీంకోర్టు విచారణను వచ్చే నెల 7కు వాయిదా వేసింది. తదుపరి తీర్పు వచ్చే వరకు తమిళనాడుకు రోజుకు 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతవరకు మధ్యంతర ఉత్తర్వులు అమలవుతాయని ఆదేశాలు జారీ చేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu