శశికళ నటరాజన్ తొలి స్టేట్ మెంట్... డీఎంకే పై విమర్శలు

 

అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేతికి వచ్చిన తరువాత శశికళ నటరాజన్ తొలిసారి ప్రతిపక్ష పార్టీల గురించి మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జల్లికట్టుపై నిషేదంపై ఆమె మాట్లాడుతూ.. సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో నిర్వహించే జల్లికట్టును నిషేధించడంలో డీఎంకే, కాంగ్రెస్ హస్తం ఉందని ఆరోపించారు. ఆ రెండు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడే తమిళ సంప్రదాయ క్రీడ జల్లికట్టుపై నిషేధం విధించారని.. ఇప్పుడు ఆ రెండు పార్టీలు అవాస్తవాలు మాట్లాడుతున్నాయని ఆరోపించారు. జల్లికట్టుపై చట్టాలు తెలియకుండా స్టాలిన్ మాట్లాడుతున్నారని.. జల్లికట్టుపై పార్లమెంటులో చట్టం సవరించాలని అమ్మ జయలలిత మోదీకి లేఖ రాశారని ఆమె గుర్తు చేశారు. మరి శశికళ వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu