మెట్రో స్టేషన్ పై నుంచి దూకి వృద్ధురాలు ఆత్మహత్య

హైదరాబాద్ మెట్రో స్టేషన్ పై నుంచి దూకి ఒక వృద్ధు రాలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ వద్ద బుధవారం ఈ ఘటన జరిగింది.

 ప్రయాణికులతో పాటు మెట్రో స్టేషన్ లోకి ప్రవేశించిన వృద్ధురాలు అకస్మాత్తుగా కిందికి దూకేసింది. పై నుంచి దూకడంతో ఆమెకు తీవ్ర గాయాలతో  అక్కడికక్కడే మరణించింది. ఆత్మహత్యకు పాల్పడిన వృద్ధురాలిని మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ కు చెందిన మారెమ్మ (70) గా గుర్తించారు.

మారెమ్మ ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని చెబుతున్నారు. మారెమ్మ హైదరాబాద్ కు ఎందుకు వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, ఆత్మహత్య చేసుకోవడానికి కారణమేంటనే వివరాలు తెలియాల్సి ఉంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu