LATEST NEWS
తెలంగాణ రాజకీయాలలో అనూహ్య సంఘటన జరిగింది. ఉప్పూ నిప్పులా ఉండే రేవంత్ రెడ్డి, హరీష్ రావులు శుక్రవారం భేటీ అయ్యారు. మాజీ మంత్రి పద్మారావుగౌడ్ తో కలిసి అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ కు వెళ్లిన హరీష్ రావు ఆయనతో దాదాపు పావుగంట సేపు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా హరీష్ రావు నియోజకవర్గాలలో ప్రొటో కాల్ పాటించడం లేదని సీఎం దృష్టికి తీసుకువచ్చారు.  ఈ భేటీకి ముందు అసెంబ్లీలో హరీష్ రావు, రేవంత్ రెడ్డిల మధ్య వాడి వేడి చర్చ జరిగింది. ఆ సందరభంగా ఇరువురూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై హరీష్ రావు   విమర్శలు చేస్తే.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనను రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. ఇది జరిగిన గంట వ్యవధిలోనే హరీష్ రావు సీఎం చాంబర్ కు వెళ్లి మరీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.  
తిరుమల ఆలయంలో హిందువులు మాత్రమే పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు  స్పష్టం చేశారు. ఈ మేరకు అవసరమైన చర్యలను వెంటనే తీసుకోవాలని ఆయన టీటీడీ అధికారులను ఆదేశించారు.  టీటీడీలో అన్యమత ఉద్యోగులను తొలగించడానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. తన మనవడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమ‌ల‌లో శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు.. చంద్రబాబు స్థానిక పద్మావతి అతిథి గృహంలో తిరుమ‌ల‌పై టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.  టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, ఇతర అధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.   తిరుమలలో ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరిగినా సహించేది లేదని ఈ సందర్భంగా ఉపేక్షించేది లేదని  సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు. ముంతాజ్ హోటల్ కు ఇచ్చిన పర్మిషన్లు రద్దు చేసినట్లు తెలిపారు. ఇలాంటి వాటికి వేరే చోట స్థలం కేటాయిస్తామన్నారు. తిరుమల ఆలయంలో కేవలం హిందువులు మాత్రమే పనిచేయాలన్నారు. అన్య మతస్తులను తిరుమలలో కాకుండా ఇతర చోట్ల వారిని షిఫ్ట్ చేస్తామని స్పష్టం చేశారు. అదే విధంగా ఇతర మత ప్రార్థనా స్థలాల్లో హిందువులు లేకుండా చూస్తామన్నారు.  
 నటుడు,  వైకాపా నేత పోసాని కృష్ణమురళికి తాత్కాలికంగా రిలీఫ్ లభించినప్పటికీ విడుదలపై ఉత్కంఠత నెలకొంది. కూటమి నేతలపై  పోసాని అనుచిత వ్యాఖ్యలు చేసిన  నేపథ్యంలో ఎపిలో 17 పోలీస్ స్టేషన్లలో  కేసులు నమోదయ్యాయి. మొత్తం ఐదు కేసులో బెయిల్ లభించినప్పటికీ పోసాని విడుదల కాలేదు. తాజాగా గుంటూరు కోర్టు సిఐడి కేసులో బెయిల్ లభించింది. పోసానిని గత నెలలో ఓబులాపురం పోలీసులు హైద్రాబాద్ నివాసంలో అరెస్ట్ చేసి రాజంపేట జైలుకు తరలించారు. పిటి వారంట్ పై నరసారావుపేట పోలీసులు అరెస్ట్ చేసి గుంటూరు జైలుకు రిమాండ్ చేశారు. తర్వాత ఆదోని పోలీసులు పిటి వారెంట్ పై అరెస్ట్ చేసి కర్నూలు జైలుకు తరలించారు. గుంటూరు సిఐడి పోలీసులు పిటి వారెంట్ పై అరెస్ట్ చేసి  గుంటూరు జైలుకు రిమాండ్ చేశారు. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని పోసాని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ ఆయనకు చుక్కెదురైంది. సిఐడి నమోదు చేసిన కేసులో గుంటూరు  సిఐడి కోర్టు పోసానికి బెయిల్ ఇచ్చింది. లక్ష రూపాయల పూచీకత్తు, రెండు జామీన్లు కోర్టుకు  ఆయన సమర్పించాల్సి ఉంటుంది.  ప్రతీ రెండు వారాలకు సిఐడి కార్యాలయానికి హాజరు కావాలి. 
నాగపూర్ లొ మూడు రోజుల అనంతరం కర్ఫ్యూ ఎత్తివేశారు. నాగపూర్ లో ఇటీవల హింసాకాండకు చెలరేగడానికి కారణమైన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం ద్వారా ఘర్షణలకు కారకుడయ్యారన్న ఆరోపణలపై ఫారీమ్ ఖాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మైనారిటీ డెమొక్రటిక్ పార్టీ నాగపూర్ అధ్యక్షుడైన ఫారీమ్ ఖాన్ తో పాటు ఆరుగురిపై దేశ ద్రోహం కేసు నమోదు చేశారు. వీరు కాకుండా మరో 50 మందిపై కూడా కేసులు నమోదు చేశారు. మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబ్‌ సమాధిని తొలగించాలని డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో శంభాజీనగర్‌లోని 18వ శతాబ్దానికి చెందిన ఆయన స్మారకానికి ఇరువైపులా భారత పురావస్తు శాఖ   ఇనుప రేకులను, కంచెను ఏర్పాటు చేసింది. పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.  చావా సినిమా విడుదల తరువాత నాగపూర్ లో హింసాకాండ చెలరేగిన సంగతి విదితమే. ఆ సినిమాలో ఛత్రపతి శంభాజీ మహరాజ్ ను మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దారుణంగా హత్య చేసినట్లుగా చూపడంతో జనం కోపోద్రిక్తులయ్యారు. ఆ సినిమా ప్రజల మనోభావాలను రెచ్చగొట్టింది. ఔరంగజేబు సమాధిని తొలగించాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున వినిపించింది. ఈ నేపథ్యంలోనే హింస చెలరేగింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు తెలిపారు.  
వెండి తెర పైనో, బుల్లి తెర పైనో, కనిపించిన ప్రతి ఒక్కరూ సెలబ్రిటీనేనా? ఇంకేమైనా అర్హతలు, యోగ్యతలు అవసరం అవుతాయా? అంటే సమాధానం చెప్పడం కష్టం కాదు గానీ,  ఇబ్బందికరంగా ఉంటుంది. వెండి తెరను, బుల్లి తెరను మలినం చేసిన, చేస్తున్న పెద్ద మనుషులు.. ఆ పెద్ద మనుషుల అడుగు జాడల్లో నడుస్తున్న కుక్కమూతి పిందిలే ఈ రోజు సమాజంలో సెలబ్రిటీలుగా చెలామణి అవుతున్నారు. అలాంటి సెలబ్రిటీలే కాసులకు కక్కుర్తి పడుతున్నారు. డ్రగ్ ఫెడ్డ్లింగ్,  బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్, ఇంకా నీచమైన పనులకు సెలబ్రిటీ స్టేటస్ ను ఉపయోగించు కుంటున్నారు. ఒక విధంగా చూస్తే.. సమాజానికి పట్టిన చీడ పురుగుల్లా తయారయ్యారు. అయితే అందరూ అంతేనా అంటే కాదు.  అందరూ కాకా పోవచ్చును కానీ.. పెద్ద హీరోలు సహా మిగిలిన సోకాల్డ్  పెద్దలు అందరూ అదే కోవకు చెందిన పెద్ద మనుషులు కావడమే విషాదం.   అవును, ఇక్కడ   పెద్ద మనుషులు అంటే  సంజహితాన్ని కోరుకునే వారో, సమాజంలో మంచి పెంచే వారు కాదు. పరమానందయ్య శిష్యుల కథలో (‘‘ప‌ర‌మ‌గురుడు చెప్పిన వాడు.. పెద్ద‌మ‌నిషి కాదురా..పెద్ద‌మ‌నిషి అంటేనే బుద్ధుల‌న్ని వేరురా..``) చెప్పినట్లు బుద్దులు వేరైన వారే ఈ రోజు సమాజంలో సెలబ్రిటీలుగా చెలామణి అవుతున్నారు.  అయితే ఒక్క సినిమా వాళ్ళు, టీవీ వాళ్ళేనా, సమాజంలోని ఇతర పెద్దలంతా  ఉత్తమ పురుషులేనా? శ్రీరామ చంద్రుడు, సీతమ్మ తల్లి అంత పవిత్రులు, పునీతులేనా? అంటే  కాదు. కానీ  అలాంటి వారి దుష్ప్రభావం సమాజం పై  ఇంత విస్తృతంగా  ఉండదు. ఎటొచ్చి, సమాజాన్ని ముఖ్యంగా టీనేజ్ యువతపై చెడు ప్రభావం చూపుతున్నది, సినిమా,టీవీ,  సోషల్ మీడియా.  ఇక ఇప్పుడు అసలు విషయంలోకి వస్తే  ఇప్పడు మనం ఏ  న్యూస్ చానల్ చూసినా, బెట్టింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్’ కేసులకు సంబంధించిన సంచలన వార్తలే ప్రముఖంగా కనిపిస్తున్నాయి. ఈ కేసుల్లో వినిపిస్తున్న పెద్ద మనుషులంతా సినిమా, టీవీ రంగాలకు చెందిన సెలబ్రిటీలే. అందులో దగ్గుబాటి వారబ్బాయి ఉన్నారు సంచలన హీరో విజయ దేవర కొండ ఉన్నారు. మంచు వారమ్మాయి ఉన్నారు. ప్రధాని మోదీకి నీతి పాఠాలు చెప్పే, పే..ద్ద మనిషి ప్రకాష్ రాజ్  ఉన్నారు. ఈ పెద్ద మనుషులతో పాటుగా, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి ‘నీతి’ బాటలో నడిచే  యాంకరమ్మ శ్యామల ఉన్నారు. ఇంకా ఇలాంటి,  సెలబ్రిటీలు   చాలా మందే ఉన్నారు. హైదరాబాద్ పోలీసులు ఈ జాబితాలో ఉన్న పెద్ద మనుషులు అందిరికో లేదా సెలెక్టివ్ గాకొందరికో నోటీసులు ఇచ్చి, విచారణ చేస్తున్నారు. సరే  ఆ సంచలనం, ఇంకొంత కాలం అలా సాగుతూ ఉంటుంది.  ఆ తర్వాత.. కథ కంచికి చేరుతుంది. గతంలో ఇంతకంటే గొప్ప సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు  చివరుకు చడీచప్పడు లేకుండా పోయింది. నిజానికి బెట్టింగ్, డ్రగ్స్ కేసులే కాదు, భూ కబ్జాలు మొదలు  సినిమా సెలబ్రిటీలతో ముడిపడిన కేసులు చాలా వరకు... ముగింపు లేకుండానే ముగిసి పోతుంటాయి. కాబట్టి  ఈకే సు ఏమి అవుతుంది అన్న ప్రశ్న అవసరం లేదు. సమా జంలో సెలబ్రిటీలుగా చలామణి అవుతున్న సినిమా పెద్దలు, సోకాల్డ్ సెలబ్రిటీలు  ఒక్క సారి ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిది. సెలబ్రిటీ స్టేటస్ తో పాటుగా, సామాజిక బాధ్యతను స్వీకరించినప్పుడే  స్టేటస్ కు   ఒక విలువ ఉంటుంది.వ్యక్తిగత జీవితంలోనే కాదు.. సినిమా నిర్మాణంలోనూ ఇది అవసరమే.
ALSO ON TELUGUONE N E W S
ఇటీవలికాలంలో బెట్టింగ్‌ యాప్‌ల ప్రమోషన్‌పై ఎడిజిపి వి.సి.సజ్జనార్‌ లేవనెత్తిన అంశం పెద్ద దుమారం రేపింది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేస్తున్న సినీ ప్రముఖులు, యూట్యూబ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ఇప్పటికే ఎంతోమంది బెట్టింగ్‌ ప్రమోటర్లపై కేసులు నమోదయ్యాయి. ఇందులో కొందరు సినీ ప్రముఖులు, కొందరు టీవీ షోల ద్వారా ప్రాచుర్యం పొందినవారు, మరికొందరు యూ ట్యూబ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్లు ఉన్నారు. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన ఈ అంశంపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.  న్యూ ఢల్లీిలోని ఆంధ్రా భవన్‌ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడుతూ ‘యువతను పెడదోవ పట్టించే బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చెయ్యకండి. డబ్బు కోసం ఇలాంటి ప్రకటనలు చేయకండి. పవిత్రమైన కళామతల్లిని సమాజ అభివృద్ది కోసం వినియోగించాలి. సినీ పరిశ్రమ ద్వారా వచ్చిన ఖ్యాతిని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదన వ్యామోహంతో అనైతిక చర్యలకు పాల్పడడం తీవ్రమైన పరిణామం. బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేయడం ద్వారా యువత జీవితాలను నాశనం చేస్తున్నారు. గతంలో అల్లూరి రామలింగయ్య వంటివారు కళను సమాజ అభివృద్ధికి ఉపయోగించారనే విషయం గుర్తుంచుకోవాలి. తమకు తెలియకుండానే బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేశామని కొందరు చెబుతుంటే.. చట్టపరంగా అవకాశం ఉంది కాబట్టి చేశామని కొందరు చెప్పడం సరికాదు. ప్రజల్లో మీకు ఉన్న పాపులారిటీ వల్ల మీరు ప్రమోట్‌ చేసే వాటిని ఎంతో సులభంగా నమ్మి మోసపోతున్న విషయాన్ని మీరు గుర్తించాలి. బెట్టింగ్‌ యాప్‌ల వల్ల వేలాది మంది యువత బలవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నప్పటికీ ఇంకా వాటిని ప్రమోట్‌ చేయడం చాలా పెద్ద నేరం. దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బెట్టింగ్‌ యాప్‌లే కాదు, గుట్కా, పాన్‌ మసాలా, తప్పుడు పద్ధతుల్లో సాగే రియల్‌ ఎస్టేట్‌, మోసపూరిత బంగారు వ్యాపారాల ప్రకటనల్లో కూడా సినీ ప్రముఖులు నటించడం ద్వారా సమాజానికి ఎంతో కీడు చేస్తున్నారు. గతంలో కోకో కోలా కంపెనీ యాడ్‌ చేసిన తరుణంలో నేను చేసిన వ్యాఖ్యలకు సినీ హీరో చిరంజీవి స్పందించి ఇకపై అటువంటి యాడ్‌లు చేయనని ప్రకటించిన విషయం మీకు తెలుసు. చట్టాల్లో లొసుగులు ఉంటాయని అందరికీ తెలుసు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తాను చట్టంలోని లొసుగుల ఆధారంగానే అనేక కేసుల నుంచి తప్పించుకున్నానని చెప్పారు. మన దేశం విషయానికి వస్తే.. గుట్కా కూడా ఆహర పదార్థమే అని ఒక న్యాయమూర్తి తీర్పు ఇచ్చిన విషయం కూడా మనకు తెలుసు. ఏది ఏమైనా డబ్బు కన్నా నైతికత చాలా ముఖ్యం అని తెలుసుకోవాలి. ఇకనైనా సమాజానికి హాని చేసే అన్ని వ్యాపార ప్రకటనలకు సినిమా పరిశ్రమ దూరంగా ఉండాలి’ అన్నారు. 
  తారాగణం: హర్ష్‌ రోషన్‌, కార్తికేయ దేవ్‌, స్టీవెన్‌ మధు, శాన్వీ మేఘన, నిహాల్‌ కోధాటి తదితరులు సినిమాటోగ్రఫీ: కార్తీక్‌ సాయి కుమార్‌ సంగీతం: సంతు ఓంకార్‌ ఎడిటర్‌: అశ్వత్‌ శివకుమార్‌ దర్శకత్వం: సుప్రీత్ కృష్ణ నిర్మాత: రాహుల్‌ రెడ్డి, శ్రీ వరుణ్, శ్రీరాములు రెడ్డి బ్యానర్: చిత్రవాహిని ప్రొడక్షన్స్, ఆర్.వై.జి. సినిమాస్ విడుదల తేదీ: మార్చి 21, 2025   హర్ష్‌ రోషన్‌, కార్తికేయ దేవ్‌, స్టీవెన్‌ మధు, శాన్వీ మేఘన ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'టుక్ టుక్'. సుప్రీత్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ 'టుక్ టుక్' చిత్రం ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం. (Tuk Tuk Movie Review)   కథ: చిత్తూరు జిల్లాలోని ఓ గ్రామంలో యుక్త వయసులో ఉన్న ముగ్గురు కుర్రాళ్ళు (హర్ష్‌ రోషన్‌, కార్తికేయ దేవ్‌, స్టీవెన్‌ మధు) సరదాగా జీవితాన్ని గడిపేస్తుంటారు. వీడియోలు షూట్ చేసి డబ్బులు సంపాదించాలనుకున్న ఆ కుర్రాళ్ళు.. అందు కోసం మంచి కెమెరా కొనాలి అనుకుంటారు. కానీ, కెమెరా కొనడానికి డబ్బులు లేకపోవడంతో.. చందాల ద్వారా డబ్బు వస్తుందనే ఆశతో వినాయకుడి విగ్రహం పెట్టి వేడుక చేస్తారు. అయితే వారు పెట్టిన వినాయక విగ్రహ నిమజ్జనానికి వాహనం దొరకదు. దాంతో మూలన పడి ఉన్న పాత చేతక్‌ స్కూటర్‌ ను రిపేర్ చేయిస్తారు. దానికి టుక్‌ టుక్‌ అని పేరు పెట్టి, వినాయకుడిని దానిపైనే ఊరేగించి నిమజ్జనం చేస్తారు. అయితే ఆ స్కూటర్‌ లో అదృశ్య శక్తి ఉంటుంది. ఆ స్కూటర్ వచ్చిన తర్వాత ముగ్గురు జీవితాలు ఊహించని మలుపులు తిరుగుతాయి. అసలు ఆ స్కూటర్‌ లో ఉన్నది ఏంటి? ఆ స్కూటర్‌ కి, శిల్ప(శాన్వీ మేఘన)కు సంబంధం ఏంటి? చివరికి ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.   విశ్లేషణ: వాహనాల చుట్టూ అల్లుకున్న కథలతో గతంలో తెలుగులో కొన్ని సినిమాలు వచ్చాయి. టుక్ టుక్ కూడా స్కూటర్ చుట్టూ అల్లుకున్న కథే అయినప్పటికీ.. అవును, కాదు అనే సైగలతో ఆ స్కూటర్ తో సమాధానాలు చెప్పించడం కాస్త కొత్తగా ఉంది. ముగ్గురు కుర్రాళ్ళ హంగామా, డబ్బు కోసం వారు పాత స్కూటర్ ను రిపేర్ చేయించడం, ఆ స్కూటర్ ద్వారా వారు డబ్బు సంపాదించే సన్నివేశాలతో సినిమా ప్రారంభమైన తీరు బాగుంది. స్కూటర్ లో ఆత్మ ఉందని తెలిశాక.. ఆ కుర్రాళ్ళ భయపడే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. అదే సమయంలో అసలు ఆ ఆత్మ ఎవరిది? ఆ వాహనంలో ఎందుకు ఉంది? ఆత్మ అని తెలిశాక ఆ కుర్రాళ్ళు ఏం చేశారు? అనే ఆసక్తిని రేకెత్తిస్తూ కథ నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ సరదా సరదాగా సాగిపోతుంది. సెకండ్ హాఫ్ లో మాత్రం బలమైన ఎమోషన్స్ ఉన్నాయి. పతాక సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమాలో మంచి సందేశం కూడా ఉంది. అయితే ఈ సినిమా కాన్సెప్ట్ విజయ్ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా' కథకి కాస్త దగ్గరగా ఉంటుంది. అలాగే కొన్ని సన్నివేశాలు లాజిక్ లెస్ గా, సాగతీతగా ఉంటాయి. అవి పక్కన పెడితే 'టుక్ టుక్' బాగానే మెప్పించింది. ఇక ఈ సినిమాకి సీక్వెల్ ఉండటం కొసమెరుపు.   నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు: హుషారైన కుర్రాళ్ళ పాత్రలలో హర్ష్‌ రోషన్‌, కార్తికేయ దేవ్‌, స్టీవెన్‌ మధు అంతే హుషారుగా నటించారు. శాన్వీ కూడా ఎమోషనల్ సన్నివేశాల్లో చక్కగా నటించి, సినిమాకి బలంగా నిలిచింది. మిగతా నటీనటులు పాత్రల పరిధి మేరకు నటించారు. టెక్నికల్‌ గా సినిమా ఉన్నతంగా ఉంది. ముఖ్యంగా కార్తీక్‌ సాయి కుమార్‌ కెమెరా వర్క్‌, సంతు ఓంకార్‌ సంగీతం హైలైట్‌ గా నిలిచాయి. ఎడిటింగ్ పరవాలేదు. సంభాషణలు ఆకట్టుకున్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.    ఫైనల్ గా.. హాస్యం, ప్రేమ, భావోద్వేగాల మేళవింపుతో రూపొందిన 'టుక్ టుక్' ప్రయాణం దాదాపు సాఫీగానే సాగింది.   రేటింగ్: 2.5/5   
  'దసరా' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రానున్న మూవీ 'ది ప్యారడైజ్'. ఇటీవల విడుదలైన 'ప్యారడైజ్' గ్లింప్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే, ఈ సినిమాని 2026 మార్చి 26న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే ఏ ముహూర్తాన ఈ రిలీజ్ ని ఫిక్స్ చేశారో కానీ.. ఈ డేట్ పై మిగతా స్టార్స్ కన్నేస్తున్నారు. (The Paradise)    జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మూవీ 'డ్రాగన్'. ఇటీవల ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. 'డ్రాగన్' సినిమాని సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే షూటింగ్ ఆలస్యంగా మొదలు కావడంతో.. ఈ సినిమాని 2026 మార్చి 26న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి. అదే జరిగితే నానికి కష్టాలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అది చాలదు అన్నట్టు, ఇప్పుడు మరో సినిమా మార్చి 26 తేదీపై కన్నేసినట్లు తెలుస్తోంది. (NTR Dragon)   రామ్ చరణ్ తన 16వ సినిమాని బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. ఈ సినిమాని 2026 వేసవికి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు 2026 మార్చి 26 డేట్ ని లాక్ చేయాలని చూస్తున్నారట. ఎందుకంటే మార్చి 27 రామ్ చరణ్ పుట్టినరోజు. ఆయన బర్త్ డే కానుకగా ఒకరోజు ముందు సినిమాని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. (RC 16)   డ్రాగన్, RC16 రెండూ భారీ సినిమాలే. అలాంటిది ఈ రెండు సినిమాలు.. 'ప్యారడైజ్' రిలీజ్ డేట్ పై కన్నేయడం నానికి బిగ్ షాక్ అని చెప్పవచ్చు. ఆ రెండూ ఒకేసారి విడుదలైతే.. తన సినిమాని వాయిదా వేసుకోవడం తప్ప నానికి మరో ఆప్షన్ ఉండదు. ఎందుకంటే.. ఎన్టీఆర్, చరణ్ సినిమాలు ఒకేసారి విడుదలైతే బాక్సాఫీస్ దగ్గర హోరాహోరీ పోరు ఉంటుంది. ఆ సమయంలో ప్రేక్షకులు ఇతర సినిమాలను పట్టించుకునే పరిస్థితి ఉండదు. పోనీ ఈ రెండూ సినిమాల్లో ఏదో ఒక్కటే విడుదలైనా కూడా.. థియేటర్ల పరంగా, కలెక్షన్ల పరంగా ప్యారడైజ్ తీవ్ర ప్రభావం ఎదుర్కోక తప్పదు. ఈ లెక్కన నాని తన సినిమాని పోస్ట్ పోన్ చేసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.  
  'పుష్ప-2'తో సంచలనం సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తదుపరి సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. నిజానికి త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ, దాని కంటే ముందు.. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టాలని చూస్తున్నాడు.   బన్నీ-అట్లీ కాంబినేషన్ ఫిల్మ్ ని సన్ పిక్చర్స్ నిర్మించనుంది. అయితే బడ్జెట్ ఏకంగా రూ.600 కోట్లు కావడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి సన్ పిక్చర్స్ తప్పుకున్నట్లు వార్తలొచ్చాయి. ఈ ప్రాజెక్ట్ దిల్ రాజు లేదా ఇతర నిర్మాత చేతిలోకి వెళ్ళే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది.   అల్లు అర్జున్, అట్లీ కాంబో మూవీ సన్ పిక్చర్స్ బ్యానర్ లోనే రూపొందనుందట. ప్రస్తుతం బన్నీ, అట్లీ దుబాయ్ లో స్టోరీ సిట్టింగ్స్ లో ఉన్నారని, ఇంకో రెండు వారాలు అక్కడే ఉంటారని సమాచారం. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న ఈ సినిమాని అధికారికంగా ప్రకటించే అవకాశముంది.   అట్లీ ప్రాజెక్ట్ ని వేగంగా సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసి, ఆ తర్వాత పారలల్ గా త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించాలనే ఆలోచనలో బన్నీ ఉన్నట్టు వినికిడి.  
ఈమధ్యకాలంలో టాలీవుడ్‌, బుల్లితెర ప్రముఖులు ఏదో ఒక విషయంలో వార్తల్లోకి ఎక్కుతూ ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రముఖులపై అన్ని రకాల కేసులు నమోదవుతున్నాయి. వాటిలో నిజానిజాలు ఏమిటి అనేది తెలియకపోయినా కేసుల ద్వారా వాళ్లు తెరపైకి వస్తున్నారు. ఈమధ్యకాలంలో ఎంతో మంది సోషల్‌ మీడియాలో, మీడియాలో వివరణ ఇచ్చుకున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న వార్త బెట్టింగ్‌ యాప్స్‌. ఈ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు సినీ, టీవీ ప్రముఖులు. ఆ క్రమంలోనే ఇప్పటికే ఎంతో మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇంకా ఎంతమంది ఈ ప్రమోషన్స్‌లో ఉన్నారనే వివరాలు సేకరించే పనిలో ఉన్నారు.  బుల్లితెర నటిగా మాత్రమే కాకుండా రాజకీయాల్లోనూ తన వాణి వినిపిస్తూ, కొన్నిసార్లు విమర్శల పాలవుతూ వస్తున్న శ్యామలపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమధ్య శ్యామల ఒక ఆన్‌లైన్‌ యాప్‌ను ప్రమోట్‌ చేస్తూ ఈజీగా డబ్బు ఎలా సంపాదించాలి అనే అంశాలను ప్రస్తావిస్తూ వీడియోలు చేసింది. దాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తనపై నమోదైన కేసును క్వాష్‌ చేయాలని హైకోర్టులో పిటిషన్‌ వేసింది శ్యామల. శుక్రవారం హైకోర్టులో శ్యామల వేసిన పిటిషన్‌ తాలూకు విచారణ జరగనుంది. 
  వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి వార్తల్లో నిలిచాడు. సినీ స్టార్స్ ప్రభాస్, విజయ్ దేవరకొండ, సమంతలలో ఒకరు ఆత్మహత్య చేసుకునే అవకాశముంది అంటూ వేణుస్వామి మాట్లాడిన ఆడియో ఒకటి లీక్ అయింది.   జ్యోతిష్యం పేరుతో ప్రముఖుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడి విమర్శల పాలవుతుంటాడు వేణుస్వామి. గతంలో ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులను టార్గెట్ చేశాడు. ముఖ్యంగా నాగచైతన్య-శోభిత ఎక్కువ కాలం కలిసి ఉండరని, విడాకులు తీసుకుంటారని వేణుస్వామి జ్యోతిష్యం చెప్పడం తీవ్ర వివాదాస్పదమైంది. అందరూ ఆయన తీరుని తప్పుబట్టడంతో పాటు, మహిళా కమిషన్ కూడా సీరియస్ అవ్వడంతో.. బహిరంగంగా క్షమాపణ చెప్పాడు. ఇలా ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ వేణుస్వామి తీరులో మాత్రం  మార్పు రావడంలేదు. పైగా, జాతకం బాలేదంటూ ప్రముఖులను భయపెట్టి, పూజల పేరుతో లక్షలు కాజేయడం ఆయన పని అని ఆరోపించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా వివాదాలతో సహవాసం చేసే వేణుస్వామి.. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు.   ప్రభాస్, విజయ్, సమంత గురించి వేణుస్వామి మాట్లాడుతున్న ఆడియో లీక్ అయింది. "నేను ముగ్గురు చనిపోతారని చెప్పా. అప్పుడు నన్ను బాగా విమర్శించారు. ఒకరు సూసైడ్ చేసుకుంటారు. ఒక హీరో, ఒక హీరోయిన్ చనిపోతారని చెప్పా. నేను చెప్పింది విజయ్ దేవరకొండ, ప్రభాస్, సమంత. ముగ్గురిలో ఎవరో ఒకరు సూసైడ్ చేసుకుంటారు. నా లెక్క ప్రకారం విజయ్ చేసుకుంటాడు. ప్రభాస్ కి హెల్త్ ప్రాబ్లెమ్స్ ఉన్నాయి." అని ఆ ఆడియో క్లిప్ లో వేణుస్వామి కామెంట్స్ చేసినట్టుగా ఉంది. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజెన్లు వేణుస్వామిపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.  
అర్జున్‌రెడ్డి, యానిమల్‌ వంటి హై ఓల్టేజ్‌ యాక్షన్‌ అండ్‌ డ్రామా చిత్రాలతో ఒక డిఫరెంట్‌ ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకున్న దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. ఇక పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సిరీస్‌, సలార్‌, కల్కి వంటి సినిమాలతో వరల్డ్‌వైడ్‌గా క్రేజ్‌ క్రియేట్‌ చేసుకున్నారు. మరి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఎక్స్‌పెక్టేషన్స్‌ ఒక రేంజ్‌లో ఉండడం సహజం. ఎప్పుడైతే ప్రభాస్‌, సందీప్‌ కాంబినేషన్‌లో స్పిరిట్‌ పేరుతో ఓ పవర్‌ఫుల్‌ సినిమా చేస్తున్నామని ప్రకటించారో అప్పటి నుంచి ఆ సినిమా అప్‌డేట్‌ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అందరికీ చిత్ర యూనిట్‌ ఓ గుడ్‌న్యూస్‌ చెప్పబోతోంది. ప్రభాస్‌ ఇమేజ్‌కి, అతని కాలిబర్‌కి తగిన కథను సిద్ధం చేసేందుకు సందీప్‌ ఇంత టైమ్‌ తీసుకున్నారు. ఇప్పుడు స్పిరిట్‌ సినిమాకి సంబంధించిన పూర్తి స్క్రిప్ట్‌ సిద్ధం అయిందట. మార్చి 30న ఉగాది పర్వదినాన ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభిస్తారని తెలుస్తోంది. అయితే రెగ్యులర్‌ షూటింగ్‌కి మాత్రం ఇంకా టైమ్‌ పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభాస్‌.. రాజాసాబ్‌ పూర్తి చేయాల్సి ఉంది. మరో పక్క ఫౌజీ కూడా షూటింగ్‌ జరుగుతోంది. అందుకే కొంత సమయం తీసుకున్న తర్వాత స్పిరిట్‌ రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తారు.  రెబల్‌స్టార్‌ ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో వచ్చిన కల్కి 2898ఎడి చిత్రం విడుదలై 9 నెలలు కావస్తోంది. ఇప్పటివరకు ప్రభాస్‌ సినిమా రిలీజ్‌కి రాలేదు. అయితే ప్రభాస్‌ తన లైనప్‌ పెంచుకుంటూ వెళ్తున్నాడు. తన నెక్స్‌ట్‌ రిలీజ్‌గా భావిస్తున్న రాజా సాబ్‌ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. దాదాపు షూటింగ్‌ పూర్తయినా కొంత ప్యాచ్‌ వర్క్‌తోపాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా ఉండడంతో మరికొంత సమయం పట్టేలా ఉంది. ఏది ఏమైనా ఈ సంవత్సరంలోనే రాజా సాబ్‌ రిలీజ్‌ అయ్యే అవకాశం ఉంది. మరో పక్క ఫౌజీ షూటింగ్‌ జరుగుతున్నప్పటికీ అనుకున్నంత వేగంగా జరగడం లేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రశాంత్‌ వర్మతో కూడా ఒక సినిమా కమిట్‌ అయ్యాడు ప్రభాస్‌. ఇవన్నీ ఇలా ఉంటే.. సలార్‌2, కల్కి2 చిత్రాల పరిస్థితి ఏమిటి అనే సందేహం అందరిలోనూ కలుగుతోంది. ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో ప్రశాంత్‌ నీల్‌ డ్రాగన్‌ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్‌ లేని సీన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఎన్టీఆర్‌ వార్‌2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అది పూర్తి చేసుకొని ఏప్రిల్‌ నుంచి డ్రాగన్‌ సెట్స్‌కి వస్తారు.  ఓపక్క ప్రభాస్‌, మరో పక్క ప్రశాంత్‌ నీల్‌ తమ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్‌తో చేస్తున్న డ్రాగన్‌ కాకుండా ప్రశాంత్‌ నీల్‌ కమిట్‌ అవ్వాల్సిన సినిమాలు చాలా ఉన్నాయని తెలుస్తోంది. ఈ పరిస్థితిలో సలార్‌2 చిత్రం సెట్స్‌కి ఎప్పుడు వస్తుంది అనేది ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. మరో పక్క ప్రభాస్‌.. కల్కి2 కూడా పూర్తి చేయాల్సి ఉంది. మేకర్స్‌ చెప్తున్న దాన్నిబట్టి ఇప్పట్లో కల్కి2 మొదలు పెట్టే అవకాశం లేదు. ఈ చిత్రాన్ని 2028లో రిలీజ్‌ చేస్తామని మాత్రం చెప్తున్నారు. అయితే కల్కి2 అనే ప్రాజెక్ట్‌ ఉంటుందా లేదా అనే సందేహం కూడా కొందరిలో ఉంది.  పార్ట్‌ 1తోనే సరిపెట్టాలనే ఆలోచనలో నాగ్‌అశ్విన్‌, అశ్వినీదత్‌ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి, ప్రభాస్‌కి ఉన్న కమిట్‌మెంట్స్‌ని బట్టి చూస్తే 2028లో కూడా కల్కి2 ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేదు. మరి ఈ ప్రాజెక్ట్‌ విషయంలో మేకర్స్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 
  ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ 'రాబిన్ హుడ్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. క్రికెటర్ గా వార్నర్ కి ఎంత క్రేజ్ ఉందో, ఎంటర్టైనర్ గా తెలుగునాట అంతకంటే ఎక్కువ క్రేజ్ ఉంది. రీల్స్ తో ఎంతో ఎంటర్టైన్ చేస్తాడు. ముఖ్యంగా 'పుష్ప' మూవీ రీల్స్ తో వార్నర్ తనని తాను కొత్తగా పరిచయం చేసుకున్నాడు. అలాంటి వార్నర్ ఇప్పుడు 'రాబిన్ హుడ్'తో వెండితెరపై సందడి చేయనున్నాడు. (Robinhood)   నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'రాబిన్ హుడ్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మార్చి 28న విడుదల కానుంది. ఈ సినిమాలో అతిథి పాత్రలో వార్నర్ సందడి చేయనున్నాడు. ఆయన పాత్ర నిడివి ఐదు నిమిషాలు ఉంటుందట. దీని కోసం వార్నర్ రెండున్నర కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. (David Warner)   మాములుగా ఐదు నిమిషాల రోల్ కి రెండున్నర కోట్ల రెమ్యూనరేషన్ అనేది పెద్ద అమౌంటే. అయితే వార్నర్ క్రేజ్.. సినిమాకి బాగానే హెల్ప్ అయ్యే అవకాశముంది. ఆ పరంగా చూస్తే రీజనబుల్ రెమ్యూనరేషన్ అని చెప్పవచ్చు.   నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో గతంలో 'భీష్మ' వంటి బ్లాక్ బస్టర్ ఫిల్మ్ వచ్చింది. హిట్ కాంబినేషన్ కావడంతో మైత్రి భారీ బడ్జెట్ తో 'రాబిన్ హుడ్'ను నిర్మించింది. ఈ మూవీ బడ్జెట్ రూ.70 కోట్లని సమాచారం. ఇది నితిన్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్. మరి ఈ 'రాబిన్ హుడ్' చిత్రం నితిన్ కి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.  
Thalapathy Vijay has announced that his next Jana Nayagan is his final film and he would be concentrating on his political career. The movie is directed by H.Vinoth and music is composed by Anirudh Ravichander. Pooja Hegde, Mamitha Baiju are playing leading ladies in the film.  Now, several reports state that KVN Productions, the producers have run into financial issues. It is stated that they could not pay to daily workers for 22 days of schedule and halted the shoot. Once, their issues clear, they will re-start the shooting and finish it as soon as possible.  The daily workers have complained to FEFSI and hence, the shoot had to be halted mid-way. KVN Productions are facing this issue, due to IT raids on a company that they have invested in and their accounts have been seized for inspection. So, they are working on raising funds to finish the shoot, say reports.  Vijay did not intervene and took the time off to plan his next political move and strategy, suggest reports. For now, the makers are confident about resolving the issues and start the shooot. Jana Nayagan is expected to release two months before 2026 Tamil Nadu Assembly Elections. 
Prakash Raaj has been held accountable for promoting Betting Apps and a police case has been registered against him in Miyapur PS, about his involvement. The actor turned into a politician and started questioning different leaders about their stance.  Now, he had to answer in this matter and he begun his video, by addressing the same. He stated that he is accountable and stated that he did the mistake. He expressed regret over being ambassador of such an app. He stated that he got to know that it is wrong to promote them and immediately, stopped it.  Prakash Raaj explained that he got an offer in 2016 and he took it without understanding the gravitas of promoting the app. When he got to know that it is wrong, he stated that he cancelled any extension of contract and asked them to not use his name anymore.  He revealed that he further asked another company who bought the app also to not use his name. He stated that he sent them legal notices as well to stop using his name in any manner. He stated that he did not receive any intimation from police but he will cooperate with them in this matter. 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  భారతీయ వంటలలో సొరకాయది చాలా  ప్రత్యేక స్థానం.  ఎక్కువ మందికి వండాలంటే గుమ్మడి,  సొరకాయ,  క్యాబేజీ వంటి బరువైన కూరగాయలను వంటకు వినియోగిస్తుంటారు.  చాలామంది సొరకాయను ఇంటికి తెచ్చుకుని వండుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ ఖద్దూ కా ఖీర్,  హల్వా.. అంటే సొరకాయ పాయసం,  సొరకాయ హల్వా.. వంటివి మాత్రం చాలా ఫేమస్ కూడా అయ్యాయి.  సొరకాయ అంటే ఇష్టపడని వారు కూడా సొరకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇకమీదట తినడానికి ఆసక్తి చూపిస్తారు.  అసలు సోరకాయలో పోషకాలు ఏంటి? సొరకాయ తినడం వల్ల కలిగే లాభాలు ఏంటి తెలుసుకుంటే.. సొరకాయలో కేలరీలు తక్కువగా,  ఫైబర్,  అవసరమైన పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి,  రక్తంలో చక్కెర నియంత్రణకు మద్దతు ఇస్తుంది. అయితే సొరకాయ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ,  దీనిని అందరూ తినే అవకాశం లేదని కూడా అంటున్నారు ఆహార వైద్యులు. సొరకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు,  నష్టాలు రెండింటిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.. సొరకాయ 90 శాతం కంటే ఎక్కువ నీరు కలిగి ఉంటుంది.  ఇది  హైడ్రేషన్‌ను నిర్వహించడానికి ఒక మంచి ఎంపిక . ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో,  కోల్పోయిన ఎలక్ట్రోలైట్‌లను తిరిగి నింపడంలో సహాయపడుతుంది.  వేసవిలో దీనిని తీసుకోవడం చాలా మంచిది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. జీర్ణక్రియ,  ప్రేగు ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.. సొరకాయ ఫైబర్ కు గొప్ప మూలం.  ఇది ప్రేగు కదలికలను నియంత్రించడంలో, మలబద్ధకాన్ని నివారించడంలో,  ఉబ్బరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌ను కూడా ప్రోత్సహిస్తుంది.  జీర్ణక్రియకు సహాయపడుతుంది,  కడుపుల యాసిడ్ రిఫ్లెక్షన్ ను  తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.. సొరకాయ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI)  కలిగి ఉంటుంది. ఇది  మధుమేహ వ్యాధిగ్రస్తులకు గొప్ప ఎంపిక. ఇందులో ఉండే కరిగే ఫైబర్ గ్లూకోజ్ శోషణను నెమ్మదిస్తుంది.  రక్తంలో చక్కెర స్థాయిలు ఆకస్మాత్తుగా  హెచ్చుతగ్గులు కావడాన్ని నివారిస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.. సొరకాయలో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్  ఉండటం వల్ల ఇది సహజంగా బరువు తగ్గించే ఆహారంగా మారుతుంది. "బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక గొప్ప ఎంపిక.  ఎందుకంటే  సొరకాయను ఏ రూపంలో తీసుకున్నా ఇది ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్  ఇస్తుంది. గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.. పొటాషియం,  యాంటీఆక్సిడెంట్లతో నిండిన సొరకాయ రక్తపోటును నియంత్రించడంలో,  కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే స్టెరాల్స్  హృదయనాళ పనితీరుకు  సపోర్ట్ చేస్తాయి. ఎవరు తినకూడదు.. సొరకాయలో చేదు రుచి ఉండటం ఒక ప్రధాన సమస్య. ఇది వికారం, వాంతులు, విరేచనాలు,  తీవ్రమైన సందర్భాల్లో ఆసుపత్రిలో చేరడానికి దారితీసే విషపూరిత సమ్మేళనం. వంట చేసే ముందు ఎల్లప్పుడూ ఒక చిన్న ముక్కను రుచి చూడాలి. అది చేదుగా ఉంటే వెంటనే దాన్ని తినకుండా ఉండటం మంచిది. తక్కువ రక్తపోటు ఉన్నవారు, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉన్నవారు, బీటా-బ్లాకర్స్ తీసుకుంటున్న వ్యక్తులు,  ఉబ్బరం, విరేచనాలకు గురయ్యే అవకాశం ఉన్నవారు సొరకాయ తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.                                    *రూపశ్రీ
  వేసవి అంటే చాలా మంది ఎదురుచూసేది మామిడి పండ్ల కోసమే. పండ్లకు రారాజు అయిన మామిడి సువాసన నుండి రుచి వరకు మైమరచిపోయేలా చేస్తుంది. అయితే చాలామంది పచ్చి మామిడిని కూరలు, పచ్చళ్ల కోసం,  పండిన మామిడిని జ్యూసులు,   నేరుగా తినడం కోసం ఉపయోగిస్తారు. కానీ వేసవిలో పచ్చి మామిడిని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పులుపును బాగా ఇష్టపడేవారు మామిడిని బాగా తింటుంటారు. కానీ పచ్చి మామిడిని అందరూ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే.. పచ్చి మామిడి వల్ల కలిగే ప్రయోజనాలు.. వేసవికాలంలో చాలామంది భయపడేది వడదెబ్బకు.  అయితే ఈ వడదెబ్బకు చెక్ పెట్టేది పచ్చి మామిడి.  పచ్చి మామిడి పండును కాస్త ఉడికించి అందులో తగినంత నీరు పోసి మిరియాలు,  ఉప్పు లేదా పంచదార వంటివి కలిపి తాగితే వడదెబ్బ భయమే ఉండదు. వేసవిలో శరీరం డీహైడ్రేట్ కావడాన్ని ఇది చెక్ పెడుతుంది. పచ్చి మామిడిలో పొటాషియం,  ఇతర ఎలక్ట్రోలైట్లు ఉంటాయి.  ఇవి వేసవిలో చెమట పట్టడం వల్ల కలిగే ఎలక్ట్రోలైట్ల అసమతుల్యతను భర్తీ చేయడంలో సహాయపడుతుంది. సాధారణంగా కొబ్బరి బొండం వంటి పానీయాలలో ఉండే ఎలక్ట్రోలైట్లు పచ్చి మామిడిలో కూడా ఉంటాయి. కాబట్టి పచ్చి మామిడిని తప్పక తినాలి. పచ్చి మామిడిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది.  ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.  వేసవిలో జీర్ణసమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అలాంటి జీర్ణసమస్యలకు చెక్ పెట్టాలంటే పచ్చి మామిడి కాయను ఆహారంలో తీసుకుంటూ ఉండాలి. పుల్లగా ఉన్న పండ్లలో విటమిన్-సి సమృద్జిగా ఉంటుంది.  పచ్చి మామిడి కూడా అలాంటి వాటిలో ఒకటి. పచ్చి మామిడిని ఆహారంలో తీసుకుంటే శరీరానికి కావలసిన విటమిన్-సి లభిస్తుంది.  శరీరంలో వేడి సంబంధిత వ్యాధులతో పోరాడటానికి ఇది సహాయపడుతుంది.  పైగా రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది. పచ్చి మామిడి కాయలు ఆల్కలీన్ ల7ణాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో ఆమ్ల స్థాయిలను సమతుల్యం చేస్తాయి.  శరీరంలో ఆమ్లత అంటే యాసిడ్ స్థాయిలను తగ్గిస్తాయి.   పచ్చి మామిడి కాయ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది.  ఇది శరీరాన్ని లోపలి నుండి చల్లగా ఉంచుతుంది.  పచ్చి మామిడి కాయతో చారు లాగా చేసుకుని ఆహారంలో తీసుకుంటే  శరీరానికి చలువ చేస్తుంది. వేసవి వేడి తగ్గుతుంది.                                  *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ఆధునిక జీవనశైలి,  ఫాస్ట్ ఫుడ్ తినడం మొదలైనవి   ఆరోగ్యంపై అనేక విధాలుగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. వీటి కారణంగా  మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. ఫాస్ట్ ఫుడ్స్,  ప్రాసెస్ చేసిన ఫుడ్స్ లో  ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వులు,  ప్రిజర్వేటివ్‌లు ఎక్కువగా ఉంటాయి.  ఇవి శరీరం డీహైడ్రేషన్ కు గురికావడం,  మూత్రపిండాల పనితీరు బలహీనపడటానికి దారితీస్తాయి. మూత్రపిండాల్లో లవణాలు,  ఖనిజాలు స్ఫటికీకరించడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల  మూత్రపిండాల్లో రాళ్లు నివారించవచ్చు. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం ఒక సాధారణ సమస్యగా మారుతున్నప్పటికీ, వాటిని నివారించడం సులభం. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం, సమతుల్య ఆహారం,  సహజ మూలికల వాడకంతో  రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. మూత్ర పిండాలలో రాళ్లు ఏర్పడకూడదు అంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాలి.. హైడ్రేషన్:  మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి  హైడ్రేటెడ్ గా ఉండటం. "రోజుకు కనీసం 2.5 నుండి 3 లీటర్ల నీరు త్రాగడం వల్ల రాళ్లు ఏర్పడటానికి దోహదపడే కాల్షియం, యూరిక్ యాసిడ్, ఆక్సలేట్‌ల వంటి ఖనిజాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. సాధారణ నీటితో పాటు, కొబ్బరి నీరు, బార్లీ నీరు అద్భుతంగా సహాయపడతాయి.  శరీరం నుండి విషాన్ని తొలగించడాన్ని ప్రోత్సహిస్తాయి.  నిమ్మకాయలు,  నారింజ వంటి సిట్రస్ పండ్లు కూడా మూత్రపిండాల్లో రాళ్లను నివారించడంలో సహాయపడతాయి. ఎందుకంటే వాటిలో ఉండే సిట్రేట్లు ఆక్సలేట్‌లు స్ఫటికాలను ఏర్పరిచే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. సరైన హైడ్రేషన్ మూత్రపిండాలలో ఖనిజాలు పేరుకుపోకుండా మూత్రపిండాల పనితీరు మెరుగ్గా ఉండేలా చేస్తాయి.   మూలికలు.. కొన్ని మూలికలు మూత్రపిండాల పనితీరుకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి.  రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తాయి. సహజ నివారణలు విషాన్ని బయటకు పంపడంలో, ఖనిజాలు పేరుకుపోకుండా నిరోధించడంలో,  మొత్తం మూత్రపిండాల ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడతాయి. అత్యంత ప్రభావవంతమైన మూలికలు.. పునర్నవ .. ఇది సహజ మూత్రవిసర్జనగా పనిచేస్తుంది, అదనపు ద్రవాలు, విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. గోక్షుర .. మూత్రపిండాల పనితీరుకు మద్దతు ఇస్తుంది,  ఖనిజ స్ఫటికీకరణను నిరోధించడంలో సహాయపడుతుంది. అరటి కాండం రసం.. మూత్రపిండాల్లో రాళ్లను విచ్ఛిన్నం చేసి బయటకు పంపుతుంది. శతావరి.. మూత్రపిండాల వడపోతను పెంచుతుంది, ఆక్సీకరణ నష్టాన్ని తగ్గిస్తుంది. బూడిద గుమ్మడికాయ రసం.. 95 శాతం నీటి శాతం,  ఆల్కలీన్ లక్షణాలతో ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.  రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్ల నివారణకు ఆహార విధానాలు.. కాల్షియం తీసుకోవడం పెంచాలి..  కాల్షియం గట్‌లోని ఆక్సలేట్‌లతో బంధిస్తుంది, మూత్రపిండాలలో వాటి స్ఫటికీకరణను నిరోధిస్తుంది. సోడియం వినియోగాన్ని పరిమితం చేయాలి.. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల కాల్షియం విసర్జన పెరుగుతుంది, రాళ్ళు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాలను తగ్గించాలి.. పాలకూర, దుంపలు,  బెండకాయలు వంటి ఆహారాలను మితంగా తినాలి,  వాటి ప్రభావాలను సమతుల్యం చేయడానికి కాల్షియం అధికంగా ఉండే ఆహారాలతో జత చేయాలి. ఆల్కలీన్ ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.. దోసకాయలు, పుచ్చకాయ,  కొబ్బరి నీరు మూత్రంలో ఆరోగ్యకరమైన pH సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడతాయి. జంతు ప్రోటీన్‌ను పరిమితం చేయాలి.. మాంసం, గుడ్లు,  చేపలను అధికంగా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. ఇది మూత్రపిండాల్లో రాళ్లకు దారితీస్తుంది.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...