కేసీఆర్ క్యాంప్ కార్యాలయం.. వాస్తు దోషం...

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు ఆఫీసును వాస్తు దోషం వదలడం లేదు. వాస్తు లోపాలతోపాటు మరికొన్ని ఇతర కారణాల వల్ల సీఎం కేసీఆర్ ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న క్యాంప్ కార్యాలయం నుంచి మారుతున్నట్టు ఆధికారులు వెల్లడించారు. సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ ను మరో భవనంలోకి మార్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుత క్యాంప్ ఆఫీస్‌ను స్పీకర్ మధుసూదనాచారికి కేటాయించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ స్వీకారం చేసిన తర్వాత క్యాంప్ ఆఫీస్ మారడం ఇది రెండవసారి. కేసీఆర్ ఈ ఆఫీసులో చేరినప్పుడు నానారకాల వాస్తు పరీక్షలు చేశారు. అప్పుడు బాగానే వుందని అనుకున్నారు. మళ్ళీ ఇప్పుడు బాగాలేదని డిసైడ్ చేశారు.. ఈ వాస్తు పండితులున్నారే....