మోడీ గొంతు కోయ‌డానికి సిద్ధంగా ఉన్నారు..

 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని వేలెత్తి చూపే వారి చేతులు, వేళ్లు నరికేస్తామని బీజేపీ చీఫ్ నిత్యానంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసినం సంగతి తెలిసిందే. ఈయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. అయితే ఇప్పుడు నిత్యానంద రాయ్ వ్యాఖ్యలపై స్పందించిన బిహార్ మాజీ ముఖ్య‌మంత్రి ర‌బ్రీ దేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఎం మోదీని వేలెత్తి చూపితే, వేళ్లు న‌రికేస్తామ‌ని అంటున్నారు... ద‌మ్ముంటే బిహారీల చేతులు న‌ర‌క‌మ‌ని నేను వారిని ఛాలెంజ్ చేస్తున్నా అని అన్నారు. బిహారీలు ఊరికే ఊరుకోరు... న‌రేంద్రమోదీ గొంతు కోయ‌డానికి, చేతులు న‌ర‌క‌డానికి చాలామంది బిహారీలు సిద్ధంగా ఉన్నారు' అని ర‌బ్రీ దేవి అన్నారు. మరి చూద్దాం ఈమె చేసిన వ్యాఖ్యలు ఇంకెంత దుమారం రేపుతాయో...