సడక్ బంద్ లో పాల్గొన్న ఎమ్మెల్యేల అరెస్ట్

 

టి.ఆర్.ఎస్. టి.జెఎసి ఇతర పార్టీలు కర్నూల్-హైదరాబాద్ నేషనల్ హైవే సడక్ బంద్ కు పిలిపునిచ్చారు. ఆలంపూర్ లో తెలంగాణావాదులు లారీల అద్దాలను ధ్వంసం చేశారు. వాహనాలను అడ్డుకుంటున్న ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో రెచ్చిపోయిన తెలంగాణా వాదులు పోలీసు వాహనాలపై రాళ్ళ వర్షం కురిపించారు. షాద్ నగర్ వద్ద కల్వకుంట్ల తారక రామారావును, కొత్తకోటలో భిక్షపతి యాదవ్, సమ్మయ్య, రాజయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంతియుతంగా తాము నిరసన తెలియజేస్తుంటే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఇలా తమను దౌర్జన్యంగా అరెస్ట్ చేయడం దారుణమని, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఈ చర్యకు తగిన మూల్యం చెల్లించుకుంటుందని, తెలంగాణా ఇస్తామని చెప్పి మాట మార్చిన వారిపై కేసులు నమోదు చేయాలని, తెలంగాణా ఉద్యమాన్ని ఎంత అణచాలనుకున్నా ఉద్యమం మరింత ఉధృతమౌతుందని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.