ప్రేమోన్మాదుల పైశాచికం

 

ఖమ్మం జిల్లాలో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం దుద్దేపూడిలో మౌనిక అనే యువతి పై ఓ యువకుడు కిరోసిన్ పోసి నిప్పంటించాడు. యువకుడితో పెళ్లికి ఒప్పుకోలేదనే కోపంతో ఇంతటి ఘాతుకానికి తలపడినట్టు సమాచారం. స్థానికులు యువతిని ఆస్పత్రికి తరలించగా ఆమె చికిత్స పొందుతూ మరణించింది. మరోవైపు హైదరాబాద్ నగరం జూబ్లిహిల్స్ లో ఇలాంటి దారుణమే జరిగింది. ఓ ప్రేమోన్మాది తన ప్రియురాలిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్రగాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలించగా ఈ రోజు ఉదయం మృతిచెందింది.