మిధున్ చక్రవర్తిని ప్రశ్నించిన ఈడీ అధికారులు

 

ఒకనాటి ప్రముఖ హిందీ చలనచిత్ర నటుడు మరియు పశ్చిమ బెంగాల్ రాష్ర్టంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్.పి అయిన మిధున్ చక్రవర్తి శారదా గ్రూప్ ఆఫ్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. ఆ గ్రూప్ కే చెందిన శారదా చిట్ ఫండ్ సంస్థలో జరిగిన భారీ కుంభకోణంలో ఇప్పటికే తృణమూల్ పార్టీకి చెందిన కొందరు మంత్రులు, యంపీలను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసారు. ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు నిన్న మిధున్ చక్రవర్తిని కూడా ఈ కుంభకోణం గురించి చాలాసేపు ప్రశ్నించి ఆయన సాక్ష్యాన్ని రికార్డు చేశారు. తనకు ఈ కుంభకోణానికి ఎటువంటి సంబంధం లేదని, తను కేవలం ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా మాత్రమే వ్యవహరించానని, అందుకోసం ఆ సంస్థ తనకు చెల్లించిన మొత్తాన్ని కూడా తను తిరిగి ఇచ్చేందుకు సిద్దమని ఈడీ అధికారులకు ఆయన చెప్పినట్లు సమాచారం. సినీ నటులందరికీ రాజకీయాలు అచ్చిరావనే సంగతి ఇదివరకు అమితాభ్ బచ్చన్, ఆ తరువాత దాసరి నారాయణ రావు ఇప్పుడు మిధున్ చక్రవర్తిలను చూస్తే అర్ధమవుతుంది.