ముగ్గురి ప్రాణాలు తీసిన ఫుట్‌బోర్డ్ ప్రయాణం

ఫుట్‌బోర్డ్ ప్రయాణం ప్రమాదకరమని ఎన్నిసార్లు చెప్పినా..ఎన్ని ప్రమాదాలు జరిగి ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నా జనంలో మార్పు రావడం లేదు. అత్యుత్సాహం, ఆనందం ముసుగులో యువకులు చేస్తోన్న సాహసం వారి ప్రాణాలను బలి తీసుకుంటోంది. తాజాగా చెన్నై నగరంలో లోకల్ ఎంఎంటీఎస్‌ ఫుట్‌బోర్డులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అదుపుతప్పి కిందపడిపోవడంతో దుర్మరణం పాలయ్యారు. చెన్నై నుంచి చెంగల్‌పట్టు వెళుతున్న ఒక లోకల్ ట్రైన్‌లో ఏడుగురు యువకులు ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణిస్తుండగా అదుపుతప్పి ఎలక్ట్రిక్ స్తంభాన్ని ఢీకొన్నారు. వీరిలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా..నలుగురు తీవ్రంగా గాయపడటంతో వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.