ముంబైలో శివసేన ముందంజ

బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు తుది అంకానికి చేరుతోంది. మొత్తం 227 వార్డులకు జరిగిన ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపులో ప్రస్తుతం శివసేన 36 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. బీజేపీ 24, కాంగ్రెస్ 6, ఎన్‌సీపీ 4, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. అటు పుణే పురపాలక ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. అక్కడ బీజేపీ 20, శివసేన 10, ఎన్‌సీపీ 10, కాంగ్రెస్ 1 స్ధానంలో ఆధిక్యంలో ఉన్నాయి.