ఇటలీ జైళ్ళలో మగ్గుతున్న 109మంది భారత పౌరులు
posted on Mar 20, 2013 11:06AM
ఇటలీ దేశం జైళ్ళల్లో సుమారు 109మంది భారత పౌరులు ఉన్నారని తెలిసింది. ఫిబ్రవరి 2010న రాజ్యసభలో ప్రతిపక్షాలు అడిగిన ప్రభుత్వం సమాధానమిస్తూ ఇటలీ ప్రభుత్వం భారత పౌరులు జైళ్ళలో ఉన్న భారతదేశ పౌరుల వివరాలను గోప్యంగా ఉంచిందని, భారతపౌరులను ఎందుకు అరెస్ట్ చేసి జైళ్ళల్లో ఉంచారన్న విషయాన్ని ఎన్ని సార్లు అడిగినా ఇటలీ ప్రభుత్వం నుండి సరైన సమాధానం రాలేదని తెలిపింది. అలాగే గతేడాది నవంబర్ లో ఈ విషయమై ఎక్స్ టర్నల్ మినిష్టర్ సల్మాన్ కుర్షీద్ మాట్లాడుతూ ఎంతమంది భారతదేశ పౌరులను ఇటలీ ప్రభుత్వం జైళ్ళలో పెట్టిందో అన్న సమాచారం తమ దగ్గర లేదని, ఇటలీ ప్రభుత్వం తమ విన్నపాలను పట్టించుకోవడం లేదని తెలిపారు. అంటే గత రెండు సంవత్సరాలుగా ఇటలీ ప్రభుత్వం భారతదేశ పౌరులను విడుల చేయలేదని తెలుస్తుంది. నేరగాళ్ళు ఏ దేశానికి చెందినవారైనా ఆ దేశానికి గర్వకారణం కాదు కానీ, ఇటలీదేశ జైళ్ళలో భారతదేశ పౌరులను ఎందుకు పెట్టారో అన్న సమాచారం కూడా భారతదేశానికి లేకపోవడం విచారకరం. జైళ్ళలో వున్నవారిలో 95 శాతం మంది పంజాబ్ నుండి వెళ్ళిన వ్యవసాయ కూలీలు కాగా వీరంతా దొంగతనంగా దేశంలో ప్రవేశించినవారు, దొంగతనాలు, హత్యలు చేసినవారు. సుఖదేవ్ సింగ్ కంగ్ అనే సిక్కు నాయకుడి అంచనా ప్రకారం సుమారు 600 నుండి 700మంది భారత పౌరులు జైళ్ళల్లో ఉన్నారని, ఖచ్చితమైన అంకె తెలపటం కష్టమని ఆయన అంటున్నారు.