![]() |
![]() |

'అతడు', 'ఖలేజా' సినిమాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'ఎస్ఎస్ఎంబి 28'(వర్కింగ్ టైటిల్). హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మహేష్ ఫస్ట్ లుక్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి 'గుంటూరు కారం' అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
'ఎస్ఎస్ఎంబి 28'కి రకరకాల టైటిల్స్ వినిపించాయి. ఇటీవల 'అమరావతికి అటు ఇటు' టైటిల్ ప్రముఖంగా వినిపించింది. త్రివిక్రమ్ టైటిల్స్ కి 'అ' సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి, ఇదే దాదాపు ఫిక్స్ అనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఫ్యాన్స్ మాత్రం ఫస్ట్ లుక్ కి తగ్గట్టుగా మాస్ టైటిల్ అయితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఫ్యాన్స్ కోరినట్టుగానే 'గుంటూరు కారం' అనే అదిరిపోయే మాస్ టైటిల్ ని మూవీ టీమ్ ఖరారు చేసినట్టు సమాచారం. 'అమరావతికి అటు ఇటు', 'గుంటూరు కారం' ఈ రెండు టైటిల్స్ ని పరిశీలించి, చివరికి 'గుంటూరు కారం'కి ఓటేసినట్టు వినికిడి. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 31 న టైటిల్ ని రివీల్ చేసే అవకాశముంది.
థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2024, జనవరి 13 న విడుదల కానుంది.
![]() |
![]() |