Home  »  News  »  Bhagyaraj: భాగ్యరాజా అంత్యక్రియలపై రాధిక సంచలన వ్యాఖ్యలు.. సర్కస్ లా మార్చింది ఎవరు!

Updated : Jun 29, 2026

 

 

తమిళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా యావత్ దక్షిణ భారత చలనచిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న ,దర్శకుడు, రైటర్, నటుడు భాగ్యరాజా రెండు రోజుల క్రితం గుండెపోటుతో చనిపోయిన విషయం తెలిసిందే. 50 ఏళ్లకి పైగా సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన కుటుంబ కథా చిత్రాలని  అందించి, మధ్యతరగతి జీవితాలని వెండితెరపై ఆవిష్కరించిన ఈ మహోన్నత కథ సృష్టికర్తకి  చివరిసారిగా నివాళులర్పించేందుకు సినీ ప్రముఖులు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. 

నిన్న  చెన్నైలోని బెసెంట్ నగర్ శ్మశాన వాటికలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి. అయితే, ఈ అత్యంత బాధాకరమైన సమయంలో కొందరు ప్రదర్శించిన అతి నెటిజన్లని , సెలబ్రిటీలను తీవ్రంగా కలచివేసింది. భాగ్యరాజ్ భౌతికకాయాన్ని దర్శించుకోవడానికి మరియు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చిన నటీనటులను కొంతమంది యూట్యూబ్ ఛానెళ్ల ప్రతినిధులు కెమెరాలతో చుట్టుముట్టారు. దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యుల ముఖాల దగ్గరకు కెమెరాలను జూమ్ చేస్తూ, వ్యూస్ కోసం వారు పడ్డ తాపత్రయం అక్కడ ఒక సర్కస్ వాతావరణాన్ని తలపించింది. భాగ్యరాజ్ కుటుంబ సభ్యులు ఆయన నేత్రాలని  దానం చేయాలని గొప్ప నిర్ణయం తీసుకున్న వేళ, కళ్లని సేకరించడానికి వచ్చిన మెడికల్ టీమ్ వాహనం దగ్గర కూడా విపరీతమైన జనం గుంపులుగా చేరి కెమెరాలతో హంగామా సృష్టించారు. కనీసం నడవడానికి కూడా వీలులేని విధంగా అక్కడి వాతావరణాన్ని మార్చేశారు. ఈ తోపులాట మరియు కెమెరాల గోల చూసి అక్కడికి వచ్చిన సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ తీవ్ర అసహనానికి, ఆవేదనకి  గురయ్యారు.

Also read: skn: యాక్టర్ గా ఎస్ కె ఎన్.. హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

కళ్లల్లో నీళ్లతో, రెండు చేతులు జోడించి అక్కడున్న మీడియా ప్రతినిధులను, వీడియోలు తీస్తున్న వారిని రాధిక వేడుకున్నారు. "మీకు టీఆర్‌పీ రేటింగుల కోసం, సోషల్ మీడియా వ్యూస్ కోసం కేవలం డ్రామా మాత్రమే కావాలంటే, మేము సినిమాల్లో నటనను చూపిస్తాం, మీకు కావలసిన డ్రామాను అందిస్తాం. కానీ దయచేసి ఇక్కడ మానవత్వంతో ఆలోచించండి. మనుషుల జీవితాలు వేరు, మాకు కొంచెం ప్రైవసీ (వ్యక్తిగత స్వేచ్ఛ) ఇవ్వండి" అంటూ తన ఆగ్రహాన్ని, బాధని వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా, సోషల్ మీడియా వేదికగా తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని (CMO), ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మరియు నడిఘర్ సంఘాన్ని ట్యాగ్ చేస్తూ ఒక సుదీర్ఘమైన పోస్ట్‌ చేసారు. ఒక మహోన్నతమైన వ్యక్తికి, 50 ఏళ్ల నా ప్రాణ స్నేహితుడికి ప్రశాంతంగా వీడ్కోలు పలకాల్సిన చోటుని కొందరు దారుణంగా ఒక సర్కస్‌లా మార్చేశారని ఆమె మండిపడ్డారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.