![]() |
![]() |

బొమ్మదేవర శ్రీదేవి సమర్పణలో సాయి రత్న క్రియేషన్స్ పతాకంపై తేజ్ బొమ్మదేవర, రిషిక లోక్రే జంటగా బొమ్మదేవర రామచంద్ర రావు దర్శక, నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న చిత్రం 'మాధవే మధుసూదన'. ఈ చిత్రం నుంచి రెండవ లిరికల్ సాంగ్ 'సైయారా.. సైయారా'ను హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ.. "మాధవే మధుసూదన సినిమా నుంచి 'సైయారా సైయారా' సాంగ్ చూడడం జరిగింది. నేను బాగోకపోతే ఎవ్వరిని పొగడను. బొమ్మదేవర రామచంద్ర రావు కుమారుడైన తేజ్ బాగా యాక్ట్ చేసాడు. కంగ్రాట్యులేషన్ తేజ్ నీకు మంచి భవిష్యత్ ఉంటుంది. కొత్త కుర్రాడు అయినా చాలా ఈజ్ వుంది. డాన్స్ బాగా చేసాడు. డైరెక్టర్ బొమ్మదేవర రామచంద్ర రావు (చంద్ర) నాకు చాలా కాలంగా తెలుసు. కానీ ఇంత బాగా డైరెక్షన్ చేస్తాడని నేను అనుకోలేదు. మంచి అభిరుచి వున్న చంద్ర, నిర్మాతగా కూడా మంచి విజయం సాధించాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. పాట చాలా బాగుంది. కొరియోగ్రఫీ కూడా బాగుంది. కొరియోగ్రాఫర్ రాజు సుందరం మాస్టర్ కి కంగ్రాట్యులేషన్. ఇక డైరెక్టర్ టీమ్ అందరికి ఆల్ ద వెరీ బెస్ట్" అన్నారు.

దర్శక, నిర్మాత బొమ్మదేవర రామచంద్ర రావు మాట్లాడుతూ.. "బ్రహ్మానందం గారు 'సైయారా సైయారా' లిరికల్ సాంగ్ విడుదల చేయడం చాలా ఆనందంగా వుంది. చాలా కాలంగా ఆయనతో మంచి అనుబంధం వుంది. ఫోన్ చేసి అడిగిన వెంటనే ఇంటికి రమ్మని నా బిడ్డ తేజ్ ను ఆశీర్వదించిన బ్రహ్మనందం గారికి ఆయన సతీమణి లక్ష్మి గారికి ఎప్పుడూ రుణపడి వుంటాను. ఈపాటను వైష్ణవి కొవ్వూరి పాడారు. మిగిలిన పాటలు త్వరలో విడుదల కాబోతున్నాయి. ఈ సినిమాకు వికాస్ బాడిస అందించిన సంగీతం మేజర్ హైలెట్. వాసు సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్. ఉద్దవ్ ఎస్ బి ఈ సినిమాకు ఎడిటర్గా బాగా వర్క్ చేశారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను ప్రకటిస్తాము" అన్నారు.
జయ ప్రకాష్, సుమన్, రామచందర్, శైలజా ప్రియ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి వికాస్ బాడిస సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా వాసు, ఉద్దవ్ ఎస్.బి వ్యవహరిస్తున్నారు.
![]() |
![]() |