గాలిపటం
posted on Jul 3, 2014
గాలిపటం
- వట్టికోట ఆళ్వార్ స్వామి
వట్టకోట ఆళ్వార్ స్వామి. తెలుగులో తొలితరం కథారచయితల్లో ముఖ్యుడు. అంతేకాదు తెలంగాణలో కథకు ఓ భూమిక ఉంది అని చెప్పడానికి ఓ చారిత్రక సాక్ష్యం. ముదిగంటి సుజాతరెడ్డి వట్టికోట ఆళ్వార్ స్వామి కథలన్నీ సేకరించి ముద్రించారు. అవి తెలుగు సాహిత్యంలో నిలిచే మణుల్లాంటివి. ఒక్కో కథ వైవిధ్యంతో కూడి మన మనసునను సునితంగా గాయం చేసి బాగుచేస్తాయి. మనల్ని నిజమైన మనుషులుగా తయారు చేసే మానవీయతను నింపుతాయి. అలాంటిదే గాలిపటం కథ.
ఈ కథ ఉత్తమ పురుషలో రచయిత చెప్తున్నట్లు నడుస్తుంది. అనారోగ్యం నుంచి కోలుకుని హాస్పెటల్ నుంచి డిశ్చార్జ్ అవుతాడు కథలో నాయకుడు. అయితే డాక్టరు రోజూ ఆవుపాలు తాగు ఆరోగ్యానికి అవసరం అని చెప్తాడు. అయితే ఎన్ని చోట్ల తిరిగినా, ఎంతమంది పాలవ్యాపారులను అడిగినా కల్తీలేని ఆవుపాలు దొరకటం కష్టం అని తెలుస్తుంది. అయితే చివరకు వాళ్ల ఇంటికి దగ్గరగా ఉండే ఓ చిన్న దుకాణంలో అడుగుతాడు. ఆ దుకాణం ముసలాయని దొరకుతాయి కానీ మనం కల్తీలేనివని పూర్తిగా నమ్మలేం అంటాడు. అప్పుడు ఆ ఇంట్లో నుంచి ఓ అందమైన స్త్రీ బైటకు వచ్చి దొరుకుతాయి. మీకు ఎన్ని కావాలి? అని అడుగుతుంది. ఆమె మాటలు, చూపులు, ప్రవర్తనలో అతనికి ఆమె తనను కోరుకుంటుంది అని అర్థమవుతుంది. కానీ తనకు పాలు అవసరం కాబట్టి... రోజూ నా కొడుకును పంపుతాను. అద్దసేరు చాలు అని చెప్పి ఇంటికి వెళ్తాడు. జరిగిన విషయం అంతా భార్యకు చెప్తాడు. భార్య సరదాగా ఆటపట్టిస్తుంది. రోజూ పాలు కొడుకుతో డబ్బులు ఇచ్చి తెప్పించుకుంటూ ఉంటాడు. రోజూ ఆ కొట్టు మీద నుంచి వెళ్లేటప్పుడు ఆమె తనను గమనిస్తున్నదన్న విషయం అతనికి తెలుస్తూనే ఉంటుంది. ఒకసారి భార్యకు కూడా ఆమెను చూపిస్తాడు.
ఒకరోజు బయటకు వెళ్తుంటే ఆమె అతడిని లెక్క సరిచూసుకోవా? అని కొట్టు దగ్గరకు పిలుస్తుంది. వెళ్తాడు. పాలు కల్తీ లేకుండా పోస్తున్నావా? అని అడిగితే... మీకు మనిషి పాలు ఇష్టమేనా...!? నా పాలే కలుపుతున్నా...! అని ఒయ్యారాలు తిరుగుతూ మా మామ లేడు. రాత్రి ఎనిమిది గంటలకు వస్తే...! అని చెప్తుంది. ఇంతలో అతని స్నేహితుడు మల్లేశం వస్తే బతుకు జీవుడా అని అతనితో ఇంటికి వెళ్తాడు. జరిగిన విషయం అంతా భార్యకు చెప్తాడు. రాత్రి ఎనిమిది గంటలకు ఆమెకు తెలియకుండా మల్లేశాన్ని తనను వెంబడించమని చెప్తాడు. అలానే ఆ సమయానికి ఆమె దగ్గరకు వెళ్తాడు. మా మామ వచ్చాడు. ఎక్కడికైనా వెళ్దాం? అని అడుగుతుంది. ఇద్దరూ కలిసి పబ్లిక్ గార్డెన్ కు వెళ్తారు. ఒక చెట్టుకింద కూర్చొంటారు. మల్లేశం వాళ్లని వెంబడిస్తూనే ఉంటాడు.
అందుకే ఈ కథ తెలుగు కథా సాహిత్యంలో ఒ కలికితురాయి అనిచెప్పొచ్చు.