వెళ్లిపోతున్న ఆ తరం వాళ్ల నుండి ఈ తరం ఏమీ నేర్చుకోకపోతే - భవిష్యత్తు అంధకారమే

Publish Date:Nov 8, 2025

ఒక్కొక్కరుగా మనకు శాశ్వత వీడ్కోలు పలుకుతూ ఒక తరం కనుమరుగవుతోంది.  అన్నం తినేముందు ఇతరుల ఆకలిని గుర్తించిన తరం.  ఇరుకు ఇళ్లల్లో గొప్ప ప్రేమతో బ్రతికిన తరం.  బాధ్యతల్ని ఎరిగిన తరం.  'నేను' అనకుండా 'మనం' అంటూ బతికిన తరం.  డిగ్రీలు లేకున్నా, జీవితాన్ని చదివిన తరం.  గడియారం లేకున్నా, సమయాన్ని సద్వినియోగం చేసుకున్న తరం.  ఇంటర్నెట్ చూడకుండా జ్ఞానాన్ని నింపుకున్న తరం.  కాలిక్యులేటర్ లేకున్నా లెక్కలు చేయగలిగిన తరం.  మొబైల్ ఫోన్ లు లేకున్నా స్నేహ సంభాషణలకు లోటు లేని తరం.  TV లు లేకున్నా వినోదంగా కాలం గడిపిన తరం.  GPS లు లేకున్నా గమ్యం ఖచ్చితంగా చేరగలిగిన తరం.  సాంకేతికత లేకున్నా సుఖసంతోషాలతో బతికిన తరం.  ACలు, కూలర్లు లేకున్నా ఆరుబయట హాయిగా నిద్రించిన తరం.  మినరల్ వాటర్ కు బదులు చెరువు/బావి నీళ్లు తాగి  ఆరోగ్యంగా బతికిన తరం.  పిజ్జాలు, బర్గర్లు కాకుండా పీచు మిఠాయిలు, పేలాలు తిని ఆనందంగా బ్రతికిన తరం.  రాత్రిళ్ళు ఇంటి అరుగులపై హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా బ్రతికిన తరం.  ఆరో ఏడు వచ్చే వరకు పిల్లల బాల్యాన్ని ఆటపాటలతో నింపిన తరం.  ఆ తర్వాత పైసా ఫీజు లేని సర్కారు బడుల్లో తెలుగు మీడియంలో పిల్లలను చదివించి - అటు తెలుగు లోనూ, ఇటు ఇంగ్లీష్ లోనూ పండితులు అయ్యేలా పిల్లలను తీర్చిదిద్దిన తరం.  కిలోమీటర్ల దూరాన్ని సైతం అవలీలగా నడవగలిగిన తరం.  క్రమశిక్షణ తప్పిన పిల్లవాడికి స్కూల్ లో టీచర్ నాలుగు దెబ్బలు వడ్డిస్తే - వాడికి మరో పది దెబ్బలు ఇంట్లో వడ్డించిన తరం.  వీధి నాటకాలను,  తోలు బొమ్మలాటలను, బుర్రకధలను ఆస్వాదించిన తరం.  సెన్సార్ అవసరం లేని సందేశాత్మక నలుపు-తెలుపు సినిమాలు చూసిన తరం.  ఇంటిముంగిటిని ముగ్గులతో అలంకరించిన తరం.  పనిమనుషులతో, యోగాలతో, జిమ్ లతో పని లేకుండా, బండెడు చాకిరీ చేసుకుంటూ, చెమటను చిందించి వందేళ్లు బతికిన తరం.  బంధాలకు, బంధుత్వాలకు విలువనిచ్చిన తరం.  ఆస్తులకన్నా, ఆప్యాయతలకు, అనుబంధాలకు ప్రాముఖ్యతనిచ్చిన తరం.  ఉమ్మడికుటుంబాలుగా ఆనందంగా జీవించిన తరం.  భేదాభిప్రాయాలున్నా అందర్నీ కలుపుకుని వెళ్ళగలిగిన తరం.  వ్యాపారంలో కల్తీకి చోటివ్వని తరం.  ఇతరుల మేలు కోరుకున్న తరం.  నీతి నిజాయితీలతో మోసాలు చెయ్యకుండా బతికిన తరం.  రాళ్లు తిన్నా అరిగించుకోగలిగిన తరం.  కార్పొరేట్ హాస్పిటల్స్ లేకున్నా ఆరోగ్యంగా జీవించిన తరం.  హార్ట్ ఎటాక్, క్యాన్సర్ ల గురించి తెలియని తరం.  బీపీలు, షుగర్ లను దరిచేరనీయని తరం.  లాంతర్లతో జీవితంలో వెలుగులు నింపుకున్న తరం.  కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొన్న తరం.  ఎంత ఉన్నా ఇంకా ఇంకా కావాలనే దురాశ లేకుండా ఆనందంగా జీవించిన తరం.  ఆడంబరాలకు దూరంగా ఉన్న తరం.  పోస్ట్ కార్డులపై సంభాషణలు జరిపిన తరం.  త్యాగాలతో పిల్లల భవిష్యత్ కు పునాదులు వేసిన తరం.  కులమతాలకు అతీతంగా సోదరభావంతో బతికిన తరం.  అలాంటి తరంలోని అపురూపమైన వ్యక్తులు నేడు ఒక్కొక్కరుగా మనల్ని విడిచి వెళ్లిపోతున్నారు. వారిని కోల్పోతుంటే సర్వం కోల్పోతున్నట్టుగా అనిపిస్తుంది.  వెళ్లిపోతున్న ఆ తరం వాళ్ల నుండి ఈ తరం ఏమీ నేర్చుకోకపోతే - భవిష్యత్తు అంధకారమే! ( సేకరణ )                     

గజిబిజి నాయకులం

Publish Date:Dec 17, 2025

వస్తున్నాం... వస్తున్నాం  మీ సంపద దోచుకోవడానికి వస్తున్నాం మీ ఓట్ల కోసం వస్తున్నాం  మీ ఓట్లతో రాజ్యాధికారంలోకి వస్తున్నాం.  కంపెనీల పేరు చెప్పి మీ భూమిని లాగేస్తున్నాం  అభివృద్ధి కావాలంటే?  మీ భూములు మాకు ఇవ్వాలె ! ఉద్యోగాలు కావాలంటే?  ఉన్నదంతా ఇచ్చేయాలి..!  మీరు అడుక్కోవాలె ..! మేము అధికారం అనుభవించాలె..!  దిక్కు మొక్కు లేదు, మీకు మేమిద్దరం తప్పా ..!  వాడు కాకపోతే మేము, మేము కాకపోతే వాడు   ఇద్దరం ఒక్కటే ? దోపీడిదారులం..మీరంతా మా బానిసలు,  మీరు మాకు వేసేది ఓటు ... మేము మీకు పొడిచేది పన్నుపోటు  మేము  మిమ్మలను, రాష్ట్ర సౌభాగ్యాన్ని తాకట్టు పెట్టేస్తాం  దొరికిన సంపదనెల్ల దోచేస్తాం...! మిగిలి ఉంటే మీకు ఇచ్చేస్తాం.  ముద్దుపేరు సంక్షేమం, రాష్ట్రానికి సంక్షోభం . ఏ దారి లేదు మీకు,.. వాడు రాకపోతే మేము , మేము కాకపోతే వాడు  దిక్కు ముక్కు లేని జనం మీరు, మీరు  మారరు మేము మారం  ఇది ముమ్మాటికి నిజం.  ఇదేరా ప్రజాస్వామ్యం అంటే ? స్వాతంత్రం వచ్చిన తర్వాత గాంధీ లేడు గణతంత్రం తర్వాత రాజ్యాంగం లేదు  ఉన్నదల్లా మేమే దోపిడీదారులం  మీ ఓటు మాకు , రాజ్యాధికారం మాకు  రాజ్యం మాదే - భోజ్యం మాదే ,  మీరంతా మా బానిసలు  ఇదేరా ప్రజాస్వామ్యం అంటే ? కులం మాటున కొట్టుకుందాం. మతం మాటున చంపుకుందాం. ఒకరినొకరిని నిందించుకుందాం.   మీరు మారరు మేము మారం.  ఉన్నదల్లా ధనస్వామ్యమే ! ఇంకెక్కడి ప్రజాస్వామ్యం!  నిలువెల్లా దగాధనస్వామ్యం!  జైహింద్   మీ... మధు,  నేతాజీ కలం

భరించేవాడే భర్త

Publish Date:Oct 23, 2019

భరించేవాడే భర్త   ‘ఏమే, షాపింగ్ చేసుకొచ్చినట్టున్నావు. ఏమేం కొన్నావేం?’’ టీవీ చూస్తూ అడిగాడు ముకుందం. ‘‘మన పెద్దాడికి జత బట్టలు, చిన్నాడికి షూస్, అమ్మాయికి ఒంటిపేట గొలుసు, పనమ్మాయికి ఒక చీర...’’ జాబితా చెప్పింది వరలక్ష్మి. ‘‘నేను గుర్తుకు రాలేదన్నమాట’’ ఛానల్ మారుస్తూ నిష్ఠూరంగా అన్నాడు ముకుందం. ‘‘భలేవారే, మిమ్మల్ని ఎలా మర్చిపోతా నండి? ఇదిగోండి 12 వేల బిల్లు’’ చేతిలో పెట్టింది వరలక్ష్మి.

చిలుకతో స్నేహం

Publish Date:Nov 2, 2021

చిలుకతో స్నేహం     ఒక అడవి అంచున చెన్నప్ప అనే బోయవాడు ఒకడు ఉండేవాడు. రోజూ ఏదో ఒకటి వేటాడి తెచ్చుకొని కడుపు నింపుకునేవాడు. అతనికి దగ్గరి బంధువులు అంటూ పెద్దగా ఎవ్వరూ లేరు- ఒంటరివాడు. ఒకరోజు అతను బిగించిన ఉచ్చులో చక్కని రామ చిలుక ఒకటి తగులుకున్నది. చాలా అందంగా, ముద్దుగా ఉన్నదది. అది దొరికిన రోజున ఇంట్లో తినేందుకు వేరే ఏమీ లేవు; కానీ చెన్నప్పకు దాన్ని చంపబుద్ధి కాలేదు. 'దీన్ని తింటే ఏం కడుపు నిండుతుంది?' అని దాన్ని ఓ పంజరంలో పడేసి, తను ఇన్ని నీళ్ళు త్రాగి పడుకున్నాడు.  తర్వాతి రోజున చెన్నప్ప నిద్రలేచే సరికి అది పంజరంలోనే తిరుగుతూ చక్కగా పాటలు పాడుతున్నది. అతనికి దాన్ని చూస్తే బలే ముచ్చట అనిపించింది. "సరేలే!‌ నీ టైం బాగుంది" అని వాడు దానికి కొన్ని పళ్ళు, విత్తనాలు తెచ్చి ఇచ్చి, వేటకు వెళ్ళాడు. ఆ రోజున అతను ఇంటికి వచ్చేసరికి చిలుక "ఇంత లేటైందేం?" అన్నది. అతను దానికేసి వింతగా చూసాడు. రోజులు గడుస్తున్న కొద్దీ అతనికి చిలుకతోటి అనుబంధం పెరిగింది. దాని రెక్కలకి బంధం వేసి, ఇప్పుడు తనతో పాటు వేటకి కూడా తీసుకువెళ్తున్నాడు, చెన్నప్ప. దానికి ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నాడు.  ఒక రోజున అతను చిలకను వెంటబెట్టుకొని అలా వేటకు వెళ్ళాడు. ఆ రోజున ఏ జంతువూ దొరకలేదు; ఎండ బాగా ఉంది కూడా. మధ్యాహ్నం అయ్యేసరికి చెన్నప్ప బాగా అలసిపోయాడు. వేటను ఆపి ఒక చెట్టుకింద విశ్రాంతిగా పడుకున్నాడు. అతన్ని అలా చూసేసరికి రామచిలకకి జాలి అనిపించింది. దగ్గర్లో అంతటా వెతికి, ఓ పళ్ల చెట్టు మీదికి అతి ప్రయత్నం మీద ఎగిరింది. కొన్ని పళ్లను తను తిని, చెన్నప్ప కోసం కూడా కొన్ని పళ్ళు తీసుకున్నది. 'ఇక క్రిందికి దూకుదాం' అనుకుంటుండగా దానికి భయంగొలిపే దృశ్యం ఒకటి కనిపించింది! చెన్నప్ప పడుకున్న చెట్టు వెనకనే ఒక పొద ఉన్నది. ఆ పొదలోనే ఒక పులి కూర్చొని ఉన్నది. అది ఆశగా చెన్నప్ప వైపే చూస్తూ, పెదిమలు నాక్కుంటున్నది! దానికి ఆకలిగా ఉందని, ఏదో ఒక క్షణంలో అది చెన్నప్ప మీదికి దూకబోతున్నదని చిలుకకు అర్థమైంది.    దాని బుద్ధి చురుకుగా పని చేసింది. చెన్నప్ప పడుకున్న చెట్టు పైనే ఒక తేనెతుట్టె ఉంది. అతనికి ఇచ్చేందుకు తను కోసిన పండ్లను అది గురిచూసి సూటిగా ఆ తేనెతుట్టె మీదికి విసిరేసింది. తేనెటీగలు 'జుం' అంటూ లేచాయి. కొన్ని తేనెటీగలు సూటిగా క్రింద ఉన్న పొద వైపుకు దూసుకు పోయాయి. వెంటనే పులిని కుట్టటం మొదలెట్టేసాయి కూడా! పులి గిరుక్కున వెనక్కి తిరిగింది. తనను చుట్టుముడుతున్న తేనెటీగలనుండి తప్పించుకోవటం కోసం దూరంగా పరుగు తీసింది. ఇక చిలుక చెన్నప్ప దగ్గరికి వెళ్ళి "లే!లే! త్వరగా!" అని అరిచింది. చెన్నప్ప లేచేసరికి చుట్టూ తేనెటీగలు ముసురుకుంటున్నాయి. చటుక్కున తను వెంటతెచ్చుకున్న గోనెసంచీలో దూరాడతను! తేనెటీగలు పోయాక బయటికి వచ్చిన చెన్నప్పకు చిలుక పులి సంగతి చెప్పింది.    పొదలో పులి ఉండిన గుర్తులు కూడా చూసాక, చెన్నప్పకు చిలుక అంటే ప్రత్యేకమైన అభిమానం కలిగింది. "నువ్వు చాలా గొప్ప స్నేహితుడివి! నా ప్రాణాలు కాపాడావు! నీకు ఏ బహుమతి ఇవ్వమంటావు, చెప్పు!" అన్నాడతను. "వేరే ఏమీ వద్దు- నీకు ఇష్టమైతే నా రెక్కలకు కట్టిన బంధాలు తీసెయ్యి. నన్ను స్వేచ్ఛగా ఎగరనియ్యి!" అన్నది చిలుక. చెన్నప్ప మారు మాట్లాడకుండా దాని రెక్కలకున్న బంధాలను తొలగించాడు. 'చిలుక ఎగిరిపోతుంది' అనుకున్నాడు. కానీ అది అతన్ని విడిచి పోలేదు! ఇప్పుడు వాళ్ల స్నేహం మరింత గట్టిపడింది.  - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

చిన్నిగుండె చప్పుళ్లు

Publish Date:Sep 21, 2015

చిన్నిగుండె చప్పుళ్లు

Swetaambaram

Publish Date:May 3, 2013

Healthcareinfointelugu

Publish Date:Apr 24, 2013

Targetdsc

Publish Date:Apr 24, 2013

Telugucinemasongs

Publish Date:Apr 23, 2013

[

Quotes

]

నిన్ను మరచిపోవాలని...

Publish Date:Feb 12, 2020

నిన్ను మరచిపోవాలని...

సాధ్యమే

Publish Date:Jul 25, 2019

ఒక్కక్షణం

Publish Date:Jul 9, 2019

యోగా డే

Publish Date:Jun 21, 2019

[

SMS

]

చూడనట్లు చూసే నీ కళ్ళకు

Publish Date:Jul 26, 2019

చూడనట్లు చూసే నీ కళ్ళకు    చూడనట్లు చూసే నీ కళ్ళకు శతకోటి వందనాలు నీ కళ్ళల్లో నన్ను చూసుకోనివు మనసారా..తనివితీరా.....! రచన - శాగంటి శ్రీకృష్ణ

నీకోసం

Publish Date:Jul 17, 2019

శాంతి

Publish Date:Jul 6, 2019

డాక్ట‌ర్ సూరం శ్రీ‌నివాసులుకు సాహితీ సిరికోన పుర‌స్కార ప్ర‌దానం

Publish Date:Apr 26, 2022

డాక్ట‌ర్ సూరం శ్రీ‌నివాసులుకు సాహితీ సిరికోన పుర‌స్కార ప్ర‌దానం ఉత్తమ సాహిత్య సృజనకు, అధ్యయనానికి అంకితమై కేవలం వాట్సప్ వేదికగానే కాకుండా ఒక సామాజిక మాధ్యమ సాహిత్య అకాడెమీగా రూపుదిద్దుకున్న 'సాహితీ సిరికోన' ప్రతి ఏటా తమ అంతర్జాతీయ వేదికపై ఎంతోమంది రచయితలను ప్రోత్సహిస్తూ పురస్కారాలు అందజేస్తోంది. ప్రతీ ఏటా అత్యుత్తమ కవితకు పురస్కారాన్ని అందించడం ఆనవాయితీగా చేసుకుంది. ఈ నేపథ్యంలో 2021కి గాను ఈ పుర‌స్కారం ప్రముఖ శతావధాని, బహుముఖ ప్రజ్ఞాశాలి డా. సూరం శ్రీనివాసులు రచించిన 'ఏటివాలు జ్ఞాపకం' కవితను వరించింది.  కాలిఫోర్నియా బే-ఏరియాలోని గూగుల్ సంస్థ సాంకేతిక నిపుణులు శ్రీ వేణు ఆసూరి గారు తమ మాతృశ్రీ స్మారకంగా ఏర్పాటు చేసిన శ్రీమతి ఆసూరి మరింగంటి సులోచనా రంగాచార్య స్మారక పురస్కారాన్ని, అలాగే 25 వేల నగదు మొత్తాన్ని డాక్ట‌ర్ సూరంకు అందించి సత్కరించారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో కూడా విలువలు ఉన్న సాహిత్యం వస్తోందని, అలాంటి సాహిత్యాన్ని ప్రోత్సహించడం మంచి విషయమన్నారు. పురస్కార గ్రహీత డా. సూరం వంటి బహుముఖ ప్రజ్ఞాశాలిని ఈ విధంగా సత్కరించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆయన రచించిన 'ఏటివాలు జ్ఞాపకం' వస్తువులోనూ, రూపంలోనూ, అభివ్యక్తి నవ్యతలోనూ ఆధునిక  ఉత్తమ మానవీయ కావ్యంగా నిలిచిపోతుందన్నారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయ ఆచార్యులు ఆచార్య రాణీ సదాశివమూర్తి  కావ్యాన్ని ఆవిష్కరించి, సిరికోన పక్షాన పురస్కార విజేతను సత్కరించారు. ఇటువంటి ఆధునిక వచన కవితా కావ్యాన్ని ధారావాహికంగా రాయటం అభినందించాల్సిన విషయమన్నారు. తొలిసారిగానైనా, ఏడాది పొడవునా సిరికోనలో ఎన్నో అంశాలమీద అద్భుతమైన కవిత్వం రాసి, అందరి ప్రశంసలు పొందిన  శ్రీ దర్భముళ్ల చంద్రశేఖర్ కు  సిరికోన ప్రత్యేక బహుమతి లభించింది. ఆం.ప్ర. భాషా సాంస్కృతిక శాఖ పూర్వ నిర్దేశకులు, ప్రముఖ నాటక కర్త, డా. దీర్ఘాసి విజయభాస్కర్ పురస్కార గ్రహీతకు రూ. 10 వేల   నగదును అందించి సత్కరించారు.  సంస్కృత విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు  శ్రీ పి.బి.ఎన్. సత్యనారాయణమూర్తి, సుప్రసిద్ధ అచ్చతెలుగు అవధాని డా. పాలపర్తి శ్యామలానందప్రసాద్ పురస్కార గ్రహీతలను ప్రశంసించారు. కేంద్ర సమాచార పూర్వ కమీషనర్, ప్రముఖ న్యాయశాస్త్రవేత్త ఆచార్య మాడభూషి శ్రీధర్ సోషల్ మీడియాలో వస్తున్న సాహిత్యాన్ని, దాని తీరుతెన్నుల్ని వివరించారు.  సిరికోన ప్రధాన సంచాలకులు ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ, జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి, ప్రముఖ కవయిత్రులు ఘంటశాల నిర్మల, స్వాతి శ్రీపాద  ప్రభృతులు విజేతలకు  అభినందనలు తెలిపారు. చివరగా డా. సూరం కృతజ్ఞతలు తెలుపుతూ, త‌న‌కు ఈ పురస్కారం లభించటం ఎంతో ఆనందంగా ఉందని హర్షానందాన్ని వెలిబుచ్చారు. ఉభయరాష్ట్రాలతో పాటు అమెరికా, లండన్, కెనడాలోని సాహిత్యాభిమానాలు జూమ్ కార్యక్రమంలో  పాల్గొన్నారు.

త్యాగరాజు

Publish Date:Mar 20, 2019

నన్నయ

Publish Date:Mar 19, 2019