సామల ఖీర్‌

 

 

 

కావలసిన పదార్ధాలు:

సామలు - ఒక కప్పు

నెయ్యి - ఒక టేబుల్‌ స్పూను

కిసిమిస్‌ - ఒక టేబుల్‌ స్పూను

జీడి పప్పు పలుకులు - 10

ఏలకుల పొడి - అర టీ స్పూను

కొబ్బరి పాలు - ఒక కప్పు

బెల్లం పొడి - ఒక కప్పు

 

తయారుచేసే విధానం:

సామలను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి సుమారు రెండు గంటలు నానబెట్టాలి. స్టౌ మీద బాణలి వేడయ్యాక నెయ్యి వేసి కరిగాక జీడి పప్పు పలుకులు, కిస్‌మిస్‌ వేసి వేయించి పక్కన ఉంచాలి. సామలలోని నీళ్లు ఒంపేసి, తగినన్ని మంచినీళ్లు జత చేసి, స్టౌ మీద ఉంచి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. కొబ్బరి పాలు జతచేయాలి. బెల్లం పొడి వేసి బాగా కలియబెట్టి, కొద్దిసేపు ఉడికించాలి. ఏలకుల పొడి, వేయించి ఉంచుకున్న జీడిపప్పులు, కిస్‌మిస్‌ జత చేసి కలిపి దింపేయాలి. వేడివేడిగా తింటే చాలా రుచిగా  ఉంటుంది.