రాగులతో వెజ్ సూప్

కావాల్సిన పదార్థాలు:

రాగిపిండి - 2స్పూన్స్

బటర్ - స్పూన్

వెల్లుల్లితరుగు- అరటీస్పూన్

ఉల్లిపాయ తరుగు - పావు కప్పు

తరిగిన క్యారెట్ ముక్కలు -పావు కప్పు

బీన్స్ - పావుకప్పు

స్వీట్ కార్న్ - పావు కప్పు

టమటా ముక్కలు - పావు కప్పు

నీళ్లు -ఒకటిన్నర గ్లాస్

ఉప్పు -రుచికి సరిపడా

మిరియాల పొడి - అర టీస్పూన్

వెనిగర్ - టీస్పూన్

తయారీ విధానం:

ఒక గిన్నెలో రాగిపిండిని తీసుకోవాలి. అందులో నీళ్లు పోసి ఉండలుగా లేకుండా కలుపుకుని పక్కనపెట్టాలి. తర్వాత కళాయిలో బటర్ వేసి వేడి చేయండి.

బటర్ కరిగిన తర్వాత వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ తరుగు, క్యారెట్ తరుగు, బీన్స్ తరుగు, స్వీట్ కార్న్ వేసి వేయించాలి.

పచ్చివాసన పోయేంత వరకు వేయించి తర్వాత టమాట ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు కలుపుతుండాలి. తర్వాత ఉప్పు, నీళ్లు, మిరియాల పొడి, వేసి కలపాలి.

నీటిని బాగా మరిగించాలి. నీళ్లు మరిగిన తర్వాత ముందుగా కలిపి పక్క పెట్టుకున్న రాగి పిండిని వేసి కలపాలి. తర్వాత వెనిగర్ వేసి కలిపాలి.

కొద్దిగా చిక్కబడే వరకు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

ఇలా చేస్తే ఎంతో రుచికరమైన రాగి సూప్ రెడీ.