కోస్తాంధ్రకు ఎల్లో అలర్ట్.. రెండ్రోజులపాటు వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం  క్రమంగా బలహీనపడుతోందని విపత్తు నిర్వహణా సంస్థ  తెలిపింది.  నైరుతి పశ్చిమ బంగాళా ఖాతంలో బలపడిన అల్పపీడనం అదే దిశగా కొనసాగుతూ క్రమంగా బలహీనడనుంది.   దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో  ఉత్తర, దక్షిణ కోస్తాలో ఉరుములతో కూడిన వర్షాలు పడనున్నాయి.  బుధ, గురువారాల్లో అకస్మాత్తుగా పిడుగులతో కూడిన  వర్షం కురుస్తుందని విపత్తు నిర్వహణా సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ప్రజలు చెట్ల క్రింద ఉండరాదని ఆయన హెచ్చరించారు. కోస్తాంధ్రకు ఎల్లో అలర్ట్ జారి అయ్యింది శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా తెలంగాణలో క్రమంగా ఊష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. నాలుగు డిగ్రీల ఊష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu