అక్రమ కట్టడాలను మాత్రమే కూలుస్తున్నాం:హైడ్రా

 

ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, డిజాస్టర్ మేనేజ్మెంట్ తమ బాధ్యత అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. తప్పుడు సర్వే నెంబర్లతో అక్రమ కట్టడాలను నిర్మించిన వాటిని మాత్రమే కూల్చుతున్నట్లు ఆయన చెప్పారు. ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్లలో ఉన్న సామాన్య ప్రజానీకాన్ని డిస్టర్బ్ చేయడం లేదన్నారు. రెండు నెలలనుంచి హైడ్రా కూల్చివేతలు ప్రారంభించినట్లు ఆయన చెప్పారు.  మూసీ సుందరీ కరణ కోసమే  హైడ్రా కూల్చివేతలు చేపట్టడం లేదని ప్రభుత్వ భూముల పరిరక్షణ ప్రధాన ఉద్దేశ్యమన్నారు. . కూకట్ పల్లిలో బుచ్చవ్వ ఆత్మహత్య బాధకలిగించిందన్నారు. కూతుళ్లకు ఇచ్చిన ఇల్లు బఫర్ జోన్ లో ఉందన్నారు. స్థానికులు భయాందోళనలకు గురి చేయడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని రంగనాథ్ వివరించారు