ఒరిజినల్ నివేదిక ఇచ్చేది లేదు... ఏసీబీ కోర్టు

రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు అరెస్ట్ సమయంలో తీసిన ఆడియో, వీడియో టేపులను ఫోరెన్సిక్ ల్యాబ్ టెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించిన నివేదికను కూడా ఏసీబీ కోర్టుకు అందజేసింది. ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు అందజేసిన నాలుగు నివేదికలను ఏసీబీ కోర్టు శుక్రవారం పరిశీలించింది. అయితే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ అదికారులు ఇచ్చిన నివేదికలను ఏసీబీ అధికారులు తమకు కావాలని కోర్టును కోరగా కోర్టు వారి అభ్యర్ధనను తిరస్కరించింది. ఒరిజినల్ నివేదిక ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది. నివేదికకు సంబంధించిన కాపీలు కావాలంటే కోర్టులో మెమో దాఖలు చేసుకోవాలని ఏసీబీ అధికారులకు సూచించింది. దీంతో ఏసీబీ అధికారులు కోర్టులో మెమో దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu