విజయవాడ-విశాఖ మధ్య విమాన సర్వీస్ ప్రారంభం ఎప్పటినుంచంటే?

 

 

ఆంధ్రప్రదేశ్  ప్రజలకు కేంద్రమంత్రి శుభ వార్త చెప్పారు. విశాఖ టు విజయవాడకు విమాన సర్వీసులు పున: ప్రారంభం కానున్నాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.  విజయవాడ, విశాఖపట్నం మధ్య విమాన సర్వీసులు జూన్ 1 నుంచి తిరిగి ప్రారంభించినున్నట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఇండిగో విమానం విజయవాడలో ఉదయం 7.15 గంటల నుంచి ప్రారంభమై విశాఖకు ఉదయం 8.25 గంటలకు చేరుకుంటుంది. మళ్లీ విశాఖపట్నంలో 8.45 గంటల నుంచి 9.50 విజయవాడకు చేరుకుంటుంది. ఈ మార్గం రాష్ట్ర రవాణా అనుసంధానంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ట్వీట్ చేశారు. వీటికి సంబంధించిన వివరాలను తాజాగా ఆయన వెల్లడించారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu