సైబరాబాద్ మొక్క చుట్టూ ఉచ్చు

మాజీమంత్రి విడదల రజినీ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. మంత్రిగా ఆమె అక్రమాలకు పాల్పడ్డారంటూ  ఫిర్యాదులు  వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని రజనీ తమ నుంచి రెండున్నర కోట్ల రూపాయలు వసూలు చేశారంటూ పల్నాడు స్టోన్ క్రషర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.  అలాగే విడదల రజినీ అక్రమాలపై  హోంమంత్రి అనితకు ఫిర్యాదు చేసింది. దీంతో అనిత విచారణకు ఆదేశించారు.   పోలీసులు విచారణ మొదలైంది.