చంద్రబాబు శ్రీకాకుళం పర్యటన రద్దు

ప్రతికూల వాతావరణం కారణంగా  చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన  రద్దయింది.  కూటమి ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు   పూర్తి అయిన సందర్భంగా  'ఇది మంచి ప్రభుత్వం' చేపట్టిన కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు ఈ రోజు రెండు సభలలో పాల్గొనాల్సి ఉంది. తొలి సభ శ్రీకాకుళంలో జరగాల్సి ఉంది.  అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన శ్రీకాకుళం పర్యటన రద్దైంది. దీంతో ఆయన ప్రకాశం జిల్లా మద్దిరాలపాడు లో జరిగే సభలో మాత్రమే పాల్గొంటారు.