కేంద్ర బడ్జెట్ అంటే అది కాదు...

 

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని ఎన్డీయే ప్రభుత్వం భావించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సమావేశాలు వాయిదా వేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, ఉత్తరఖండ్, పంజాబ్ రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల తాయిలాలను బడ్జెట్ లో ప్రతిపాదించే అవకాశం ఉందని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. దీనికి  కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పందించి.. కేంద్ర బడ్జెట్ అంటే ఒక రాష్ట్రానికి సంబంధించినది కాదని... బడ్జెట్ అంటే కేవలం రాయితీలు, పన్నుల తగ్గింపులు ఇవే కాదని చెప్పారు. బడ్జెట్ లేకపోతే ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేమని.. విపక్షాలు ఎందుకు అడ్డుకుంటున్నాయో అర్థం కావడం లేదని అన్నారు. సర్వేల్లో ప్రధాని మోదీకి అనుకూలంగా ఫలితాలు వస్తుండటంతో... తమతమ అజెండాలను పదేపదే విపక్షాలు మార్చుకుంటున్నాయని విమర్శించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu