వాటర్ ట్యాంకులో మృతదేహాలు..

 

తిరుపతిలో ఓ దారుణమైన ఘటన వెలుగు చూసింది. వాటర్ ట్యాంకులో మూడు మృతదేహాలు లభ్యమవ్వడంతో స్ధానికులు భయాందోళలో ఉన్నారు. వివరాల ప్రకారం.. తిరుపతి రైల్వే స్టేషన్‌ సమీపంలోని వాటర్‌ ట్యాంకు నుండి దుర్వాసన రావడంతో రైల్వే కూలీలు వాటర్‌ ట్యాంకులో చూడగా అందులో 3 మృతదేహాలు ఉన్నాయి. దీంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్ధలికి చేరుకున్న పోలీసులు మూడు మృతదేహాలను బయటకు తీశారు. అందులో ఒకటి రైల్వేస్టేషన్‌లో వాటర్‌ బాటిల్స్‌ విక్రయించే అబ్దుల్లాగా కూలీలు గుర్తించారు. మిగిలిన ఇద్దరి మృతదేహాలను గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu