తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.71 కోట్లు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం (మే31) తిరుమల శ్రీవారిని 80వేల 284 మంది దర్శించుకున్నారు.

34వేల96 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక గురువారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం 14 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.