కాళేశ్వరం ప్రారంభోత్సవం.. ఒకే చోట ముగ్గురు సీఎంలు!
posted on Jun 21, 2019 11:41AM
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా మేడిగడ్డ వద్ద నిర్వహించిన జలసంకల్ప మహాయాగం పూర్ణాహుతి కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్, తెలంగాణ మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాసేపట్లో సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు.
మేడిగడ్డ బ్యారేజీ వద్ద వరుణుడి కరుణ కోసం వేద పండితులు జల సంకల్ప హోమం నిర్వహించారు. శృంగేరి పీఠానికి చెందిన ఫణిశశాంక్ శర్మ, గోపీకృష్ణ ఆధ్వర్యంలో 40 మంది వేద పండితులు పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులతో మేడిగడ్డ వద్ద సందడి వాతావరణం నెలకొంది.