కేసీఆర్ కు హరీశ్ రావు పాదాభివందనం..

 

తెలంగాణ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్ రావు ఈరోజు తన 44వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈసందర్భంగా ఆయన ముఖ్యమంత్రి, తన మామ అయిన కేసీఆర్ ను కలిశారు. ఆయనకు పాదాభివందనం చేయగా..  కేసీఆర్‌ ఆయనను ఆశీర్వదించారు. ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. రాష్ట్ర‌ మంత్రులు, ప‌లువురు కార్య‌క‌ర్త‌ల న‌డుమ ఆయ‌న కేక్ క‌ట్ చేశారు. హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి.. హరీశ్‌రావుకు కేక్‌ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు పుట్టిన రోజు వేడుక సంద‌ర్భంగా హ‌రీశ్ రావుకి శుభాకాంక్ష‌లు తెల‌ప‌డానికి మంత్రులు, కార్య‌కర్త‌లు రావ‌డంతో అక్క‌డ సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. కొందరు మహిళా నేతలు ఆనందంతో నృత్యాలు చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu