ఓడి గెలవడం టీమిండియాకు అలవాటే-సచిన్

ఆస్ట్రేలియాతో పుణేలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం పాలవ్వడంతో అభిమానులు, మాజీ క్రికెటర్లు కోహ్లీసేనపై విమర్శలు కురిపిస్తున్నారు. అయితే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మాత్రం టీమిండియాకు అండగా నిలిచారు. ఇవాళ ఢిల్లీలో 21 కిలోమీటర్ల మారథాన్ కార్యక్రమంలో పాల్గొన్న సచిన్..టీమిండియా ఓటమిపై స్పందించారు. మనమేం సిరీస్‌ను కోల్పోలేదని..మన ఆటగాళ్లలో పోరాటపటిమ ఉందన్నారు. ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయినంత మాత్రాన చేతులు ఎత్తేసినట్లు భావించరాదని, ఆ తర్వాత జరిగే మ్యాచ్‌లలో భారత్ పుంజుకుంటుందని సచిన్ ఆశాభావం వ్యక్తం చేశారు.