తెలంగాణలో ప్రారంభమైన ఏపీ గ్రూప్-2 ప్రిలిమ్స్

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష ప్రారంభమైంది. ఉదయం 10 గంటలకల్లా అభ్యర్థులు పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఇందుకోసం ఏపీలో 1376 కేంద్రాలు ఏర్పాటు చేశారు..తెలంగాణలో కూడా 86 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకూ పరీక్ష జరగనుంది. అయితే నిబంధనల మేరకు ఉదయం 9.45 గంటలకే గేట్లను మూసివేశారు. హాట్ టికెట్‌తో పాటు గుర్తింపు కార్డు ఒరిజనల్ తేవడం తప్పనిసరికావడంతో, గుర్తింపు కార్డు లేకుండా వచ్చిన అభ్యర్థులను లోపలికి అనుమతించలేదు. మొత్తం 442 ఎగ్జిక్యూటివ్, 540 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను దీని ద్వారా భర్తీ చేయనున్నారు.