మహానాడుకి జూ.ఎన్టీఆర్ డుమ్మా
posted on May 27, 2013 12:43PM
తెలుగుదేశం పార్టీ మహానాడు గండిపేటలో ప్రారంభమయింది. 32వ మహానాడు కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు హరికృష్ణ, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ లు హాజరయ్యారు. పాదయాత్ర తరువాత జరుగుతున్న మహానాడు కావడంతో చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు ప్రకటిస్తారని, ఇప్పటికే 14 తీర్మానాలను సిద్దం చేశారని, వీటితో పాటు అవినీతి మీద చంద్రబాబు కీలక ప్రకటన చేస్తారని, తెలంగాణ మీద మరింత స్పష్టత ఇస్తారని అంటున్నారు.గత కొన్నాళ్లుగా పార్టీకి దూరంగా ఉంటున్న హరికృష్ణ మహానాడుకు విచ్చేశారు. అయితే పార్టీ కండువా కప్పుకునేందుకు ఆయన ఒప్పుకోలేదు. మొదట పార్టీ వేదిక మీదకు రాని ఆయన తరువాత మీదకు వచ్చినా కండువా మాత్రం వేసుకోలేదు. ఆయనకు చంద్రబాబు మీద ఇంకా ఆగ్రహం తగ్గలేదని తెలుస్తోంది. మహానాడులో చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణల ఫ్లెక్సీలు కనిపించినా హరికృష్ణ, ఎన్టీఆర్ ల ఫోటోలు మాత్రం కనిపించలేదు.