ఐటీ విచారణకు రేవంత్ గైర్హాజరు

 

కొద్దిరోజుల క్రితం తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ,అతని సన్నిహితుల నివాసాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు.పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు.ఈ నేపథ్యంలో ఈ నెల 3 న విచారణకు హాజరైన రేవంత్ రెడ్డిని  దాదాపు నాలుగున్నర గంటలపాటు అధికారులు విచారించారు.అనంతరం తదుపరి విచారణకు ఈనెల 23వ తేదీన మరోసారి హాజరు కావాల్సిందిగా ఆదేశించిన సంగతి తెలిసిందే.దీంతో నేడు విచారణకు రేవంత్ హాజరవుతారని అంతా భావించారు.రేవంత్ తో పాటు ఆయన అనుచరుడు ఉదయ్ సింహా, మామ పద్మనాభరెడ్డి, శ్రీ సాయి మౌర్యా కంపెనీ డైరెక్టర్లు ప్రవీణ్ రెడ్డి, సురేశ్ రెడ్డి, శివరామిరెడ్డి, రామచంద్రారెడ్డిలు సైతం విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలొచ్చాయి.కానీ రేవంత్ విచారణకు హాజరుకాలేదు.ఆడిటర్స్ ద్వారా డాక్యుమెంట్లను అందిస్తానని చెప్పారు.అలాగే రేవంత్‌రెడ్డి విచారణకు హాజరుకాలేదని ఐటీ అధికారులు తెలిపారు.