ఏపీ లో భారీగా ఐపీఎస్‌ల బదిలీ

 

ఆంధ్ర ప్రదేశ్ లో 14 మంది ఐపీఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.బదిలీ అయిన అధికారుల వివరాలు.. 

  • కడప ఎస్పీగా ఉన్న అట్టాడ బాబూజీని విశాఖ రూరల్‌ ఎస్పీగా,
  • చిత్తూరు ఎస్పీ రాజశేఖర్‌ను గుంటూరు రూరల్‌ ఎస్పీగా,
  • విశాఖ రూరల్‌ అడిషనల్‌ ఎస్పీ ఐశ్వర్య రాస్తోగిని నెల్లూరు ఎస్పీగా, 
  • విశాఖ లా అండ్‌ ఆర్డర్‌ డీసీసీ ఫకీరప్పను కర్నూలు ఎస్పీగా, 
  • తిరుపతి అర్బన్‌ ఎస్పీ అభిషేక్‌ మహంతిని కడప ఎస్పీగా, 
  • పార్వతీపురం ఓఎస్డీ విక్రాంత్‌ పాటిల్‌కు చిత్తూరు ఎస్పీగా 
  • చిత్తూరు ఓఎస్డీ అన్బురాజన్‌కు తిరుపతి అర్బన్‌ ఎస్పీగా, 
  • విశాఖ రూరల్‌ ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మను విశాఖ టీం ఎస్పీగా , 
  • గుంటూరు రూరల్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడును విజయవాడ లా అండ్‌ ఆర్డర్‌ డీసీపీగా, 
  • నెల్లూరు ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణను సెక్యూరిటీ ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఎస్పీగా, 
  • కడప అడిషనల్‌ ఎస్పీ అద్మాన్‌ నయీం అస్మీకు విశాఖ లా అండ్‌ ఆర్డర్‌ డీసీపీగా,
  • కర్నూల్‌ ఎస్పీ గోపీనాథ్‌ జెట్టీని తితిదే సెక్యూరిటీ, విజిలెన్స్‌ ఆఫీసర్‌గా,
  • నర్సీపట్నం ఓఎస్డీ సిద్ధార్థ కౌశల్‌కు గుంతకల్లు రైల్వే ఎస్పీగా బదిలీ చేశారు.