ఏపీ లో భారీగా ఐపీఎస్ల బదిలీ
posted on Oct 23, 2018 4:29PM
ఆంధ్ర ప్రదేశ్ లో 14 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.బదిలీ అయిన అధికారుల వివరాలు..
- కడప ఎస్పీగా ఉన్న అట్టాడ బాబూజీని విశాఖ రూరల్ ఎస్పీగా,
- చిత్తూరు ఎస్పీ రాజశేఖర్ను గుంటూరు రూరల్ ఎస్పీగా,
- విశాఖ రూరల్ అడిషనల్ ఎస్పీ ఐశ్వర్య రాస్తోగిని నెల్లూరు ఎస్పీగా,
- విశాఖ లా అండ్ ఆర్డర్ డీసీసీ ఫకీరప్పను కర్నూలు ఎస్పీగా,
- తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతిని కడప ఎస్పీగా,
- పార్వతీపురం ఓఎస్డీ విక్రాంత్ పాటిల్కు చిత్తూరు ఎస్పీగా
- చిత్తూరు ఓఎస్డీ అన్బురాజన్కు తిరుపతి అర్బన్ ఎస్పీగా,
- విశాఖ రూరల్ ఎస్పీ రాహుల్దేవ్ శర్మను విశాఖ టీం ఎస్పీగా ,
- గుంటూరు రూరల్ ఎస్పీ వెంకట అప్పలనాయుడును విజయవాడ లా అండ్ ఆర్డర్ డీసీపీగా,
- నెల్లూరు ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణను సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్పీగా,
- కడప అడిషనల్ ఎస్పీ అద్మాన్ నయీం అస్మీకు విశాఖ లా అండ్ ఆర్డర్ డీసీపీగా,
- కర్నూల్ ఎస్పీ గోపీనాథ్ జెట్టీని తితిదే సెక్యూరిటీ, విజిలెన్స్ ఆఫీసర్గా,
- నర్సీపట్నం ఓఎస్డీ సిద్ధార్థ కౌశల్కు గుంతకల్లు రైల్వే ఎస్పీగా బదిలీ చేశారు.